మధ్యప్రదేశ్ బాణా సంచా పరిశ్రమలో అగ్ని ప్రమాదం: 23 మంది మృతి 10 మంది గాయపడ్డారు

- June 08, 2017 , by Maagulf
మధ్యప్రదేశ్ బాణా సంచా పరిశ్రమలో అగ్ని ప్రమాదం: 23 మంది మృతి 10 మంది గాయపడ్డారు

మధ్యప్రదేశ్ బాణా సంచా పరిశ్రమలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది.  ఈ ప్రమాదంలో 23 మంది సజీవ దహనం కాగా, మరో 10 మంది గాయపడ్డారు.  బాలాఘాట్‌లో ఉన్న బాణాసంబా కర్మాగారంలో ఈ ప్రమాదం సంభవించింది. పేలుడు ధాటికి పరిశ్రమ మొత్తం కుప్ప కూలింది.  పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి.  బాధితుల హాహాకారాలతో ఆ ప్రాంతమంతా శోసంద్రం అయ్యింది.  గాయపడ్డవారిని నాగపూర్ ఆసుపత్రికి తరలించారు.  వీరిలో ఇద్దరి పరిస్థితి సీరియస్‌గా ఉంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com