భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు
- June 08, 2017
వరుసగా నాలుగు రోజుల పాటు పెరుగుతూ వచ్చిన బంగారం ధర గురువారం నాటి ట్రేడింగ్లో ఒక్కసారిగా పడిపోయింది. 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి రూ.195 తగ్గి రూ.29,600లకు చేరింది. అంతర్జాతీయ పరిణామాలు, ఆభరణాల తయారీదారుల నుంచి కొనుగోళ్లకు మద్దతు లభించకపోవడంతో బంగారం ధర తగ్గిందని బులియన్ ట్రేడింగ్ వర్గాలు తెలిపాయి. మరోపక్క వెండి ధర కూడా స్వల్పంగా తగ్గింది. కిలో వెండి రూ.150 తగ్గడం ద్వారా రూ.40,750కు చేరింది. పరిశ్రమల వర్గాల నుంచి డిమాండ్ లేకపోవడం, నాణేల తయారీదారుల నుంచి కొనుగోళ్ల తగ్గడం వెండి ధర తగ్గుదలకు కారణమైంది. అంతర్జాతీయంగా ఔన్సు బంగారం ధర 0.10శాతం తగ్గి 1,285.50 అమెరికన్ డాలర్లు పలికింది.
తాజా వార్తలు
- దిబ్బా తీరంలో తొమ్మిది మంది అరెస్టు..!!
- కువైట్ లో మహిళను జైలుపాలు చేసిన సోషల్ మీడియాలో పోస్ట్..!!
- వేసవిలో కార్మికుల భద్రతపై వీడియో వైరల్..స్పందించిన WOQOD..!!
- సౌదీ విద్యార్థి అల్-ఖస్సిం హంతకుడికి యావజ్జీవ కారాగార శిక్ష..!!
- భారతీయ వ్యక్తిని చంపిన వ్యక్తులను అరెస్ట్ చేసిన షార్జా పోలీసులు..!!
- సెక్యూరిటీ, స్టేబిలిటీపై చర్చించిన సౌదీ, బహ్రెయిన్..!!
- డెలివరీ రైడర్ల కోసం ఎయిర్ కండిషన్డ్ విశ్రాంతి కేంద్రాలు సిద్ధం చేసిన RTA
- దోహాలో ఘనంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- భారత్పే అదిరిపోయే ఫీచర్..
- ఏపీ కేబినెట్ సమావేశం..అమరావతిలో ‘అమరావతి ఐ’ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్









