భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు
- June 08, 2017
వరుసగా నాలుగు రోజుల పాటు పెరుగుతూ వచ్చిన బంగారం ధర గురువారం నాటి ట్రేడింగ్లో ఒక్కసారిగా పడిపోయింది. 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి రూ.195 తగ్గి రూ.29,600లకు చేరింది. అంతర్జాతీయ పరిణామాలు, ఆభరణాల తయారీదారుల నుంచి కొనుగోళ్లకు మద్దతు లభించకపోవడంతో బంగారం ధర తగ్గిందని బులియన్ ట్రేడింగ్ వర్గాలు తెలిపాయి. మరోపక్క వెండి ధర కూడా స్వల్పంగా తగ్గింది. కిలో వెండి రూ.150 తగ్గడం ద్వారా రూ.40,750కు చేరింది. పరిశ్రమల వర్గాల నుంచి డిమాండ్ లేకపోవడం, నాణేల తయారీదారుల నుంచి కొనుగోళ్ల తగ్గడం వెండి ధర తగ్గుదలకు కారణమైంది. అంతర్జాతీయంగా ఔన్సు బంగారం ధర 0.10శాతం తగ్గి 1,285.50 అమెరికన్ డాలర్లు పలికింది.
తాజా వార్తలు
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్లో భారతీయ పాస్పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!







