ఆలూ కొత్తిమీర రైస్
- June 08, 2017
కావాల్సిన పదార్థాలు: బియ్యం- ఒక కిలో, బంగాళదుంపలు- అరకిలో, కొత్తిమీర-రెండు కట్టలు, పచ్చిమిర్చి-100గ్రా, ఉప్పు-తగినంత, నూనె - సరిపడా.
తయారుచేయు విధానం: ముందుగా అన్నం వండుకుని పక్కన పెట్టుకోవాలి. బంగాళదుంపలను చెక్కుతీసి చిన్నచిన్న ముక్కలుగా తరుగుకోవాలి. కొత్తిమీరను శుభ్రంగా కడిగి మిక్సీలో వేసి దాంట్లో పచ్చిమిర్చి, సరిపడా ఉప్పు వేసుకుని నీరు పోసి మెత్తగా రుబ్బుకోవాలి. ఇప్పుడు పొయ్యిమీద బాణలి పెట్టుకుని అందులో సరిపడా నూనె వేసుకోవాలి. బాగా కాగాక తరిగిపెట్టుకున్న బంగాళదుంప ముక్కలను వేసి ఐదునిమిషాలపాటు దోరగా వేగించుకోవాలి. తర్వాత రుబ్బిపెట్టుకున్న కొత్తిమీర పేస్టుని కూడా వేసి మరో ఐదు నిమిషాలు మగ్గనివ్వాలి. ఇప్పుడు వండి పెట్టుకున్న అన్నాన్ని ఒక పళ్ళెంలోకి తీసుకుని ఆ అన్నంలో పై మిశ్రమాన్ని వేసి బాగా కలుపుకోవాలి. నూనెలో ఎర్రగా వేగించిన బంగాళదుంప చక్రాల్ని అలంకరణ కోసం అన్నంపై పెట్టాలి. దీన్ని ఉల్లిచట్నీ లేదా టమోటాపెరుగు పచ్చడితో తింటే రుచిగా ఉంటుంది.
తాజా వార్తలు
- 2027 గోదావరి పుష్కరాలను అట్టహాసంగా నిర్వహించాలని సీఎం చంద్రబాబు ఆదేశం
- CBSE బోర్డులో భారీ మార్పులు..
- వర్షాకాలంలో నీటి నిల్వలు, ట్రాఫిక్ అంతరాయాల నివారణకు ముందస్తు చర్యలు
- వాహనాలకు పూర్తి నష్టం పేమెంట్స్..సౌదీ సెంట్రల్ బ్యాంక్ కీలక ఉత్తర్వులు..!!
- ఇరాన్, ఇరాక్లకు వెళ్లడం పై నిషేధం విధించిన బహ్రెయిన్..!!
- తొలి 30 మిలియన్ దిర్హమ్ల విజేత వివరాలు వెల్లడించిన యూఏఈ లాటరీ..!!
- 'సాస్ ఫర్ ఎక్సలెన్స్' కార్యక్రమాన్ని ప్రారంభించిన ఒమన్ రవాణా మంత్రిత్వ శాఖ..!!
- సమ్మర్ లో వాహనాల్లో అగ్నిప్రమాద నివారణకు ఖతార్ రవాణా శాఖ సూచనలు..!!
- కువైట్ లో భారత రాయబార కార్యాలయం ఆధ్వర్యంలో యోగా ఫెస్టివల్..!!
- ప్రైవేటు స్కూళ్ల ఫీజులపై సీఎం విజయ్ కీలక నిర్ణయం









