ఆలూ కొత్తిమీర రైస్
- June 08, 2017
కావాల్సిన పదార్థాలు: బియ్యం- ఒక కిలో, బంగాళదుంపలు- అరకిలో, కొత్తిమీర-రెండు కట్టలు, పచ్చిమిర్చి-100గ్రా, ఉప్పు-తగినంత, నూనె - సరిపడా.
తయారుచేయు విధానం: ముందుగా అన్నం వండుకుని పక్కన పెట్టుకోవాలి. బంగాళదుంపలను చెక్కుతీసి చిన్నచిన్న ముక్కలుగా తరుగుకోవాలి. కొత్తిమీరను శుభ్రంగా కడిగి మిక్సీలో వేసి దాంట్లో పచ్చిమిర్చి, సరిపడా ఉప్పు వేసుకుని నీరు పోసి మెత్తగా రుబ్బుకోవాలి. ఇప్పుడు పొయ్యిమీద బాణలి పెట్టుకుని అందులో సరిపడా నూనె వేసుకోవాలి. బాగా కాగాక తరిగిపెట్టుకున్న బంగాళదుంప ముక్కలను వేసి ఐదునిమిషాలపాటు దోరగా వేగించుకోవాలి. తర్వాత రుబ్బిపెట్టుకున్న కొత్తిమీర పేస్టుని కూడా వేసి మరో ఐదు నిమిషాలు మగ్గనివ్వాలి. ఇప్పుడు వండి పెట్టుకున్న అన్నాన్ని ఒక పళ్ళెంలోకి తీసుకుని ఆ అన్నంలో పై మిశ్రమాన్ని వేసి బాగా కలుపుకోవాలి. నూనెలో ఎర్రగా వేగించిన బంగాళదుంప చక్రాల్ని అలంకరణ కోసం అన్నంపై పెట్టాలి. దీన్ని ఉల్లిచట్నీ లేదా టమోటాపెరుగు పచ్చడితో తింటే రుచిగా ఉంటుంది.
తాజా వార్తలు
- చైనాలో అధికారిక పర్యటనకు అబుదాబి క్రౌన్ ప్రిన్స్ షేక్ ఖాలెద్ బీజింగ్ చేరిక
- ముంబై పై బెంగళూరు ఘన విజయం
- ఐటీ నిరుద్యోగులకు గుడ్ న్యూస్..
- లక్నో పై గుజరాత్ ఘన విజయం
- స్కామ్ వివాదం పై నోరువిప్పిన సింగర్ మంగ్లీ
- భారత విదేశాంగ మంత్రి జైశంకర్కు యూఏఈ అధ్యక్షుడు ఘన స్వాగతం..
- ట్రంప్ సంచలన ప్రకటన..
- అమరనాథ్ యాత్ర తేదీలు ఖరారు..
- తిరుమల శ్రీవారి జులై నెల సేవా టికెట్ల విడుదల
- ఈస్ట్-వెస్ట్ పైప్లైన్ ఫుల్ పంపింగ్ సామర్థ్యం పునరుద్ధరణ..!!









