ఏపీఎన్ఆర్టీ సీఈవోగా సాంబశివరావు నియమితులయ్యారు
- June 08, 2017
ఆంధ్రప్రదేశ్ ప్రవాస తెలుగు కార్పొరేషన్.. ఏపీఎన్ఆర్టీ సీఈవోగా కె.సాంబశివరావు నియమితులయ్యారు. రాష్ట్రంలో పలువురు అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీచేసింది. ఈ మేరకు కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్గా డి.మార్కండేయులు బాధ్యతలు చేపట్టనున్నారు. అన్నవరం వీరవెంకట సత్యనారాయణస్వామి దేవస్థానం ఈవోగా ఉన్న కె.నాగేశ్వరరావును విజయనగరం జేసీగా నియమించారు. పోస్టింగ్ కోసం ఎదురుచూస్తున్న సాల్మన్ రాజ్కుమార్ విజయనగరం జిల్లా డీఆర్వోగా బదిలీ అయ్యారు. కడప డీఆర్డీఏ పీడీగా ఎల్.విజయచందర్ను నియమించారు. పోస్టింగ్ కోసం ఎదురుచూస్తున్న డిఫ్యూటీ కలెక్టర్ వైవీ సత్యభాస్కర్ను సీసీఎల్ఏలో సహాయ కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టనున్నారు. మరో డిఫ్యూటీ కలెక్టర్ గౌతమిని తిరుమల తిరుపతి దేవస్థానం ఉప జేఈవోగా నియమించారు. పోస్టింగ్ కోసం ఎదురుచూస్తున్న నాన్రాజును విపత్తుల నిర్వహణ కేంద్రం కమిషనర్ కార్యాలయంలో డిప్యూటీ డైరెక్టర్ (అడ్మిన్)గా నియమించారు. నెల్లూరులో పనిచేస్తున్న కనక నర్సారెడ్డిని చిత్తూరు జిల్లా షెడ్యూలు కులాల సేవా సహకార సంఘం ఈడీగా నియమించారు.
తాజా వార్తలు
- అమరనాథ్ యాత్ర తేదీలు ఖరారు..
- తిరుమల శ్రీవారి జులై నెల సేవా టికెట్ల విడుదల
- ఈస్ట్-వెస్ట్ పైప్లైన్ ఫుల్ పంపింగ్ సామర్థ్యం పునరుద్ధరణ..!!
- ఉమ్ సలాల్ సెంట్రల్ మార్కెట్ లో మున్సిపల్ మినిస్టర్ తనిఖీలు..!!
- దుబాయ్-చైనా ఆర్థిక సంబంధాల విస్తరణపై చర్చలు..!!
- 24-గంటలపాటు ఫుడ్ హబ్ ప్రారంభం..!!
- 15 ఏళ్ల ప్రవాస బాలిక ఆచూకీ లభ్యం..!!
- భారీ వర్షాల నేపథ్యంలో సౌదీలో క్లాసులు రద్దు..!!
- గోల్డెన్ వీసా హోల్డర్లు విదేశాల నుంచి పని చేయవచ్చా?
- సౌదీ అరేబియాలో తెలుగు సమాఖ్య సేవా గాథ—నిరాశలో ఉన్న వ్యక్తికి కొత్త జీవితం









