గుండెపోటుతో ఆసియా వలసదారుడి మృతి
- June 16, 2017
ఇండియాకి చెందిన వలసదారుడొకరు, తుబ్లిలోని అపార్ట్మెంట్లో గుండెపోటుతో మరణించారు. అల్ కూహెజి టెక్నికల్ సర్వీసెస్లో సూపర్ వైజర్గా మృతుడు ధర్మరాజు పనిచేస్తున్నారు. గత కొంతకాలంగా ఆయన గుండె సంబంధిత అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారు. అనారోగ్యం కారణంగా ఇండియాకి వెళ్ళి, రెండ్రోజుల క్రితమే తిరిగి వచ్చాడాయన. గుండెలో నొప్పి రావడంతో అంబులెన్స్కి సమాచారం అందించగా, అంబులెన్స్ వచ్చేటప్పటికే ధర్మరాజు మృతి చెందారు. ఫార్మాలిటీస్ పూర్తయిన అనంతరం ధర్మరాజు మృతదేహాన్ని స్వదేశానికి తరలిస్తారు.
తాజా వార్తలు
- ఏఐ ఎయిర్పోర్ట్ సర్వీసెస్లో ఉద్యోగాలు..
- వాటర్ బిల్లు పేరుతో ఏపీకే ఫైల్స్..సీపీ సజ్జనార్ కీలక సూచనలు
- చమురుయేతర రంగాలలో GCC ఎకానమీ దూకుడు..!!
- ప్రపంచ వృద్ధి అంచనాలను తగ్గించనున్న ఐఎంఎఫ్..!!
- ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ఒమన్ విదేశాంగ మంత్రి..!!
- Dh4 ట్రాఫిక్ ఫైన్? ఫేక్ SMS స్కామ్ బస్ట్..!!
- BD800 మిలియన్లతో 50వేల హౌజింగ్ యూనిట్లు..!!
- సంక్షోభాన్ని ఐక్యతతో అధిగమించిన యూఏఈ
- ఇస్లామాబాద్ వేదికగా అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు: ఉత్కంఠలో ప్రపంచం!
- శ్రీలంక లో పర్యటించిన FTPC ఇండియా బృందం









