18 మందికి జీవిత ఖైదు, 8 మందికి 15 ఏళ్ళ జైలు
- June 16, 2017
హై క్రిమినల్ కోర్టు, 26 మంది వ్యక్తులకు తీవ్రవాద గ్రూపు ఏర్పాటు చేశారన్న నేరాభియోగాల నేపథ్యంలో జైలు శిక్ష విధించింది. 'షాబ్ అల్ దురాజ్' (దురాజ్ యూత్) పేరుతో తీవ్రవాద గ్రూపుని ప్రారంభించి, తీవ్రవాద దాడులకు పాల్పడిన నేరానికిగాను వీరికి ఈ జైలు శిక్ష విధింపబడింది. మొత్తం 26 మందిలో 18 మందికి జీవిత ఖైదు, 8 మందికి పదిహేనేళ్ళ జైలు శిక్షను న్యాయస్థానం ఖరారు చేసింది. వీరందరికీ బహ్రెయిన్ పౌరసత్వాన్ని రద్దుచేస్తూ న్యాయస్థానం తీర్పు వెల్లడించింది. అయితే ఇందులో ఒకరు బహ్రెయినీ వ్యక్తి కాదు. జైలు శిక్ష పూర్తయ్యాక అతన్నీ దేశం నుంచి బహిష్కరిస్తారు. 2011 నుంచి 2013 వరకు వీరు తీవ్రవాద భావజాలంతో దాడులకు పాల్పడ్డారు. ఐదో నిందితుడి సహకారంతో ఇంప్రూవైజ్డ్ బాంబుల్ని తయారు చేసింది ఈ గ్రూపు. 2013, సెప్టెంబర్ 18న నిందితులు ఫైర్ బాంబులు, అలాగే ఇంప్రూవైజ్డ్ గన్స్తో పోలీసులపై దాడులకు దిగారు.
తాజా వార్తలు
- గాన కోకిల ఎస్.జానకి కన్నుమూత
- సీఎం రేవంత్తో ఎమిరేట్స్ వైస్ ప్రెసిడెంట్ భేటీ.. కీలక అంశాల పై చర్చ
- అమెరికాకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ను అప్పగించిన ఖతార్..!!
- ద్వైపాక్షిక, ప్రాంతీయ పరిస్థితులపై అమెరికా–సౌదీ చర్చలు..!!
- సలాలా తీరంలో ఒమన్ పౌరుడిని రక్షించిన కోస్ట్ గార్డ్..!!
- కువైట్లో వారాంతంలో తీవ్రమైన ఎండలు.. హెచ్చరిక..!!
- అల్ మజారె స్ట్రీట్ విస్తరణకు అధ్యయనం.. ట్రాఫిక్ సమస్యలకు చెక్..!!
- సమ్మర్ లో పిల్లల భద్రతపై ఫుజైరా పోలీసుల హెచ్చరిక..!!
- యూఏఈలో తొలి ‘లాంగెవిటీ మెడిసిన్’ అకడమిక్ కోర్సులు ప్రారంభించనున్న తుంబే గ్రూప్
- నకిలీ యాప్ల పట్ల అప్రమత్తంగా ఉండండి.. దుబాయ్ పోలీసుల హెచ్చరిక







