పొగరుబోతు పోలీస్ అధికారికి మూడు సంవత్సరాల జైలుశిక్ష
- June 17, 2017
గల్ఫ్ దేశాల సమాఖ్యకు చెందిన ఒక పౌరుని పట్ల దురుసుగా ప్రవర్తించడమే కాక ఆ వ్యక్తి పై దాడికి పాల్పడి గాయపరిచిన నేరానికి ట్రాఫిక్ డైరెక్టరేట్ లో పనిచేస్తున్న ఓ పోలీసు అధికారి పొగరుకు తగిన బహుమతి లభించింది. మూడు సంవత్సరాలపాటు కటకటాల వెనుక ఉండాలంటూ హై క్రిమినల్ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. కోర్టు నివేదిక ప్రకారం,ఈ సంఘటన గత ఏడాది తెల్లవారుజామున 3:30 గంటల సమయంలో మనామ హోటల్ లో జరిగింది, అక్కడ ప్రతివాది బార్ లో కూర్చొని ఒక బీరును తాగుతున్నాడు. ఆ క్షణాన అక్కడకు వచ్చిన పోలీసు అధికారికి జిసిసి పౌరుని మధ్య ఒక వివాదం జరిగింది. " మా డబ్బుతో మేము మిమ్మల్ని తీసుకొస్తాం ..అలాగే మిమ్ముల్ని కొనుగోలు చేస్తాం " అని గల్ఫ్ దేశాల సమాఖ్యకు చెందిన పౌరుడు తనతో వాదనకు తెర తీసేడని పోలీసు అధికారి న్యాయస్థానానికి తెలిపాడు. అనంతరం జిసిసి వ్యక్తి కొద్దిసేపటికి టాయిలెట్ లోనికి ప్రవేశించగానే ఆ నిందిత పోలీస్ అధికారి బాధితుడిని అనుసరించాడు. జిసిసి పౌరుడిని గోడ వైపునకు బలంగా నెట్టివేశాడు మరియు ఆ వ్యక్తి తలపై పిడి గుద్దులు విసరడమే కాక, బాధితుని ముక్కును విరగకొట్టాడు. దీనితో ఆ పోలీస్ ఆధికారిపై కేసు నమోదైంది.ఆ తర్వాత అరెస్టు కాబడిన ఆ పోలీస్ అధికారి తన నేరాన్ని న్యాయస్థానం ముందు అంగీకరించాడు.
తాజా వార్తలు
- క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్..2027 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల
- సాహ్ల్ ద్వారా డొమెస్టిక్ వర్కర్లు, డ్రైవర్ల స్పాన్సర్షిప్ బదిలీ..!!
- షార్జాలో హత్యకు గురైన భారతీయుడి మృతదేహం స్వదేశానికి తరలింపు..!!
- ఏప్రిల్లో 16% పెరిగి SR14.7 బిలియన్లకు చేరిన రెమిటెన్స్..!!
- ఆన్లైన్లో ఉగ్రవాద సంబంధిత దుస్తులు సేల్..ముగ్గురు అరెస్టు..!!
- ఒమన్ సాంస్కృతిక వారసత్వ హోదా పటిష్టం..!!
- డ్రైవర్కు 3 నెలల జైలు శిక్ష విధించిన దుబాయ్ కోర్టు..!!
- ఖతార్ లో అత్యధిక ఉష్ణోగ్రతలు, దుమ్ము తుఫాన్ల అలెర్ట్..!!
- హైదరాబాద్ కు రూ.లక్ష కోట్లు కేటాయించండి..ప్రధాని మోదీని కోరిన సీఎం రేవంత్
- అమెరికా దాడిలో వైజాగ్ వాసి మృతి









