పొగరుబోతు పోలీస్ అధికారికి మూడు సంవత్సరాల జైలుశిక్ష
- June 17, 2017
గల్ఫ్ దేశాల సమాఖ్యకు చెందిన ఒక పౌరుని పట్ల దురుసుగా ప్రవర్తించడమే కాక ఆ వ్యక్తి పై దాడికి పాల్పడి గాయపరిచిన నేరానికి ట్రాఫిక్ డైరెక్టరేట్ లో పనిచేస్తున్న ఓ పోలీసు అధికారి పొగరుకు తగిన బహుమతి లభించింది. మూడు సంవత్సరాలపాటు కటకటాల వెనుక ఉండాలంటూ హై క్రిమినల్ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. కోర్టు నివేదిక ప్రకారం,ఈ సంఘటన గత ఏడాది తెల్లవారుజామున 3:30 గంటల సమయంలో మనామ హోటల్ లో జరిగింది, అక్కడ ప్రతివాది బార్ లో కూర్చొని ఒక బీరును తాగుతున్నాడు. ఆ క్షణాన అక్కడకు వచ్చిన పోలీసు అధికారికి జిసిసి పౌరుని మధ్య ఒక వివాదం జరిగింది. " మా డబ్బుతో మేము మిమ్మల్ని తీసుకొస్తాం ..అలాగే మిమ్ముల్ని కొనుగోలు చేస్తాం " అని గల్ఫ్ దేశాల సమాఖ్యకు చెందిన పౌరుడు తనతో వాదనకు తెర తీసేడని పోలీసు అధికారి న్యాయస్థానానికి తెలిపాడు. అనంతరం జిసిసి వ్యక్తి కొద్దిసేపటికి టాయిలెట్ లోనికి ప్రవేశించగానే ఆ నిందిత పోలీస్ అధికారి బాధితుడిని అనుసరించాడు. జిసిసి పౌరుడిని గోడ వైపునకు బలంగా నెట్టివేశాడు మరియు ఆ వ్యక్తి తలపై పిడి గుద్దులు విసరడమే కాక, బాధితుని ముక్కును విరగకొట్టాడు. దీనితో ఆ పోలీస్ ఆధికారిపై కేసు నమోదైంది.ఆ తర్వాత అరెస్టు కాబడిన ఆ పోలీస్ అధికారి తన నేరాన్ని న్యాయస్థానం ముందు అంగీకరించాడు.
తాజా వార్తలు
- విరమణ పొందిన ఏడుగురు పోలీసు అధికారులకు ఘన వీడ్కోలు.. సేవలను కొనియాడిన సైబరాబాద్ సీపీ డా. రమేష్
- డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తుదారులకు అలర్ట్.. ఆర్టీఓ కొత్త రూల్స్..
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు టీటీడీ భారీ ఏర్పాట్లు
- ప్రధాని మోదీ పర్యటనకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు: డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
- భోగాపురం ఎయిర్పోర్ట్ ఏర్పాట్ల పై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్
- తెలంగాణలో పెట్టుబడులకు ఇదే సరైన సమయం: సీఎం రేవంత్
- సాంకేతికతతో భవిష్యత్ పోలీసింగ్కు పోలీసులు సిద్ధం కావాలి: డీజీపీ సీవీ ఆనంద్
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్కాందే బాధ్యత







