యూకే వెల్కమ్స్ మోదీ
- October 13, 2015
యూకేలోని భారతీయ సంఘాలు ప్రత్యేకంగా 'మోదీ ఎక్స్ప్రెస్' బస్సును ప్రారంభించాయి. వచ్చే నెలలో భారత ప్రధాని నరేంద్రమోదీ యూకేలో తొలి పర్యటనకు వెళ్లనున్నారు. ఈ సందర్భంగా ఈ బస్సును ప్రారంభించినట్లు వారు చెప్పారు. ఈ బస్సు నెల రోజుల పాటు లండన్లోని ముఖ్య ప్రాంతాల్లో పర్యటించనుందని వారు చెప్పారు. ఈ బస్సును గత ఆదివారం ప్రారంభించగా లిటిల్ ఇండియాగా పేరొందిన వెంబ్లీలోని ఈలింగ్ రోడ్లో తొలిస్టాప్లో ఆగింది. దీపావళి నాటికి ట్రఫాల్గర్ స్క్వేర్ చేరుతుంది.ఈ సందర్భంగా 'యూకే వెల్కమ్స్ మోదీ' కార్యక్రమ నిర్వాహకురాలు మయూరి పర్మార్ మాట్లాడుతూ భారత్లో 'చాయ్ పే చర్చ' కార్యక్రమం నిర్వహించినట్లుగానే.. యూకేలో మోదీతో 'బస్ పే చర్చ' కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. మోదీ రాకను పురస్కరించుకొని నవంబర్ 13వ తేదీన దాదాపు 400 సంస్థలు కలిసి.. వెంబ్లీ స్టేడియంలో ఓ పెద్ద కార్యక్రమం నిర్వహించ తలపెట్టారు. ఈ కార్యక్రమానికి సుమారు 60వేల మంది హాజరుకానున్నట్లు సమాచారం.
తాజా వార్తలు
- నిరాహార దీక్ష ఆపేది లేదు–సోనమ్ వాంగుక్ ప్రకటన
- ఇరాన్ దాడుల ప్రభావం.. బహ్రెయిన్, కువైట్, ఖతార్ విమానాలకు అంతరాయం
- ఏపీ విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్..
- డీజీపీ సీవీ ఆనంద్ ని కలిసిన క్రికెటర్ మహమ్మద్ సిరాజ్
- సెప్టెంబర్లో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 10
- బహ్రెయిన్ వైమానిక నావిగేషన్ పరికరాలే లక్ష్యం..అయినా విమాన రాకపోకలకు అంతరాయం లేదు
- ఢిల్లీ ఘటన పై తెలంగాణ సీఎం రేవంత్ ఫైర్..
- ఇరాన్ కొనసాగిస్తున్న దాడులు..కువైట్ పై క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- ‘రాజు ఆమ్లెట్’ వ్యవస్థాపకుడు రాజీవ్ మెహెరిష్ కన్నుమూత
- యూఏఈలో భారతీయుల పాస్పోర్ట్ సేవలకు ఊరట.. అల్హింద్ ద్వారా తాత్కాలికంగా కాన్సులర్ సేవలకు సుప్ర







