బహ్రెయినీ టీచర్ హత్య: 10 మందికి జైలు
- June 20, 2017
ఫోర్త్ హై క్రిమినల్ కోర్ట్, పది మంది వ్యక్తులకు శిక్ష ఖరారు చేసింది. గత ఏడాది ఈస్ట్ ఎకెర్లో ఓ బహ్రెయినీ టీచర్ని హత్య చేసిన కేసులో నిందితులపై అభియోగాలు మోపబడ్డాయి. ఈ ఘటనలో టీచర్కి చెందిన ముగ్గురు పిల్లలకు గాయాలయ్యాయి. అభియోగాలు ఎదుర్కొంటున్నవారిలో ఒకరికి మరణ శిక్ష, మరో వ్యక్తికి జీవిత ఖైదు, మిగతావారికి మూడేళ్ళ జైలు శిక్షను న్యాయస్థానం విధించింది. అందులో ఇద్దరికి బహ్రెయిన్ పౌరసత్వాన్ని రద్దు చేయాలనీ ఆదేశించింది న్యాయస్థానం. సెక్యూరిటీ ఫోర్సెస్ని టార్గెట్ చేస్తూ ఈస్ట్ ఎకెర్ దగ్గర్లోని షేక్ జబెర్ అల్ అహ్మద్ అల్ సబా వద్ద బాంబు పేలుళ్ళకు పాల్పడ్డారు నిందితులు. ఈ ఘటనలో 42 ఏళ్ళ టీచర్ ఫక్రియా ముస్లిం మృతిచెందారు. ఈ ఘటనలో పోలీసులు నిందితుల్ని అరెస్ట్ చేసి న్యాయస్థానం ముందుంచారు.
తాజా వార్తలు
- విరమణ పొందిన ఏడుగురు పోలీసు అధికారులకు ఘన వీడ్కోలు.. సేవలను కొనియాడిన సైబరాబాద్ సీపీ డా. రమేష్
- డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తుదారులకు అలర్ట్.. ఆర్టీఓ కొత్త రూల్స్..
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు టీటీడీ భారీ ఏర్పాట్లు
- ప్రధాని మోదీ పర్యటనకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు: డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
- భోగాపురం ఎయిర్పోర్ట్ ఏర్పాట్ల పై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్
- తెలంగాణలో పెట్టుబడులకు ఇదే సరైన సమయం: సీఎం రేవంత్
- సాంకేతికతతో భవిష్యత్ పోలీసింగ్కు పోలీసులు సిద్ధం కావాలి: డీజీపీ సీవీ ఆనంద్
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్కాందే బాధ్యత







