బహ్రెయినీ టీచర్‌ హత్య: 10 మందికి జైలు

- June 20, 2017 , by Maagulf
బహ్రెయినీ టీచర్‌ హత్య: 10 మందికి జైలు

ఫోర్త్‌ హై క్రిమినల్‌ కోర్ట్‌, పది మంది వ్యక్తులకు శిక్ష ఖరారు చేసింది. గత ఏడాది ఈస్ట్‌ ఎకెర్‌లో ఓ బహ్రెయినీ టీచర్‌ని హత్య చేసిన కేసులో నిందితులపై అభియోగాలు మోపబడ్డాయి. ఈ ఘటనలో టీచర్‌కి చెందిన ముగ్గురు పిల్లలకు గాయాలయ్యాయి. అభియోగాలు ఎదుర్కొంటున్నవారిలో ఒకరికి మరణ శిక్ష, మరో వ్యక్తికి జీవిత ఖైదు, మిగతావారికి మూడేళ్ళ జైలు శిక్షను న్యాయస్థానం విధించింది. అందులో ఇద్దరికి బహ్రెయిన్‌ పౌరసత్వాన్ని రద్దు చేయాలనీ ఆదేశించింది న్యాయస్థానం. సెక్యూరిటీ ఫోర్సెస్‌ని టార్గెట్‌ చేస్తూ ఈస్ట్‌ ఎకెర్‌ దగ్గర్లోని షేక్‌ జబెర్‌ అల్‌ అహ్మద్‌ అల్‌ సబా వద్ద బాంబు పేలుళ్ళకు పాల్పడ్డారు నిందితులు. ఈ ఘటనలో 42 ఏళ్ళ టీచర్‌ ఫక్రియా ముస్లిం మృతిచెందారు. ఈ ఘటనలో పోలీసులు నిందితుల్ని అరెస్ట్‌ చేసి న్యాయస్థానం ముందుంచారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com