దోహాకు భారత్ అదనపు విమానాలు
- June 22, 2017
పవిత్ర రంజాన్ పర్వదినం నేపథ్యంలో ప్రయాణికుల రద్దీ దృష్ట్యా దోహాకు తాత్కాలికంగా అదనపు విమానాలను ఏర్పాటు చేసింది భారత ప్రభుత్వం. ఇలా అదనపు సర్వీసులు నడపాల్సిందిగా ఎయిరిండియా, జెట్ ఎయిర్వేస్ను ప్రభుత్వం కోరింది.
కొన్ని మధ్యప్రాచ్య దేశాలు ఖతార్ విమానాలపై నిషేధం విధించిన నేపథ్యంలో ఈ చర్య చేపట్టాలని సూచించింది. ఈ నేపథ్యంలో జెట్ ఎయిర్వేస్ జూన్ 22, 23 తేదీల్లో ముంబై-దోహాల మధ్య 168 సీట్ల విమానాలు నడుపుతుంది.
ఎయిరిండియా అనుబంధ సంస్థ అయిన ఎయిరిండియా ఎక్స్ప్రెస్ జూన్ 25 నుంచీ జులై 8వ తేదీ వరకూ తిరువనంతపురం-దోహా, కొచ్చిన్-దోహాల మధ్య 186 సీట్ల విమానాలను నడుపుతుందని పౌరవిమానయానశాఖ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.
కేంద్ర విదేశాంగ వ్యవహారాల మంత్రి సుష్మాస్వరాజ్ అదనపు విమానాల అవసరంపై ఇటీవల పౌరవిమానయానశాఖ మంత్రి అశోక్గజపతి రాజుతో చర్చించిన నేపథ్యంలో ఈ అదనపు విమాన సర్వీసులను నడపాలని నిర్ణయించారు.
తాజా వార్తలు
- QR14.667 బిలియన్లకు POS, ఇ-కామర్స్ లావాదేవీలు..!!
- ఆప్టామిల్ మిల్క్ పౌడర్ పై SFDA క్లారిటీ..!!
- దక్షిణ ఇరాన్లో భూకంపం..యూఏఈ సేఫ్..!!
- కువైట్ లో వేలానికి 208 వాహనాలు..!!
- ఒమన్ లో తప్పిపోయిన చిన్నారి సురక్షితం..!!
- ప్రభుత్వ పర్యవేక్షణలో ప్రైవేట్ ఆసుపత్రులు..!!
- విదేశీ ప్రయాణాలు చౌక.. TCS 2 శాతానికి తగ్గింపు
- సీఎం రేవంత్ రెడ్డికి అరుదైన అంతర్జాతీయ గుర్తింపు
- లోక్సభలో బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్
- హైదరాబాద్లో మరో కొత్త షాపింగ్ మాల్..







