రక్త దానం చెయ్యండి విఐపీ కోటాలో షిర్డీలో బాబాను దర్శనం చేసుకోండి
- June 22, 2017
ప్రసిద్ద షిర్డీ ఆలయంలో సాయిబాబా దర్శనం కోసం ఇక క్యూ లైన్లలో వేచి చూడాల్సిన అవసరం లేదు. రక్తదానం చేస్తే ఇక షిర్డీ ఆలయంలో విఐపి హోదాలో దర్శనం చేసుకొనే వెసులుబాటును కల్పించనుంది సాయిబాబా ట్రస్టు.
సాయిబాబాను దర్శించుకొనేందుకు వెళ్ళినవారు రక్తదానం చేయడం ద్వారా ఒక ఏడాదిపాటు ఆలయంలో విఐపీ హోదాలో దర్శనం చేసుకోవచ్చు. అంతేకాదు సత్రాల్లో కూడ బస విషయంలో కూడ విఐపి హోదాను కల్పిస్తారు.
సర్వమానవ శ్రేయస్సు కోసం ఈ కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించినట్టు ట్రస్ట్ ఛైర్మెన్ సురేష్ హరే ప్రకటించారు. షిర్డిని బ్లడ్ బ్యాంక్ హబ్ గా మార్చడం తమ ఉద్దేశ్యమన్నారు.
తిరుమల తిరుపతిలో తలనీలాలు సమర్పించినట్టుగానే షిర్డీకి వచ్చినవారు రక్తదానం చేయడం ఆనవాయితీగా మారుస్తామన్నారు. రక్తదానం ఎంత గొప్పదో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదన్నారాయన. రక్తదానం చేయడం ద్వారా మానవతా తృక్పథాన్ని చాటుకోవడంతో పాటు ఒక మంచి పనిచేశామనే సంతృప్తి కూడ దక్కనుందన్నారు.
తాజా వార్తలు
- జేవాకింగ్ ప్రమాదాలపై అవగాహన కల్పించిన దుబాయ్ పోలీసులు
- దుబాయ్ ఎమిరేట్స్ రోడ్ ప్రమాదం: బాధితుల మృతదేహాలు భారత్, శ్రీలంకకు తరలింపు
- వర్షాలు, ప్రకృతి విపత్తుల పై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష
- హైదరాబాద్ వాతావరణ కేంద్రం అలర్ట్..
- సింగపూర్ చేరుకున్న సీఎం చంద్రబాబు.. ఘనస్వాగతం పలికిన తెలుగు ప్రజలు
- ఫ్రాన్స్ అధ్యక్షుడి తో ప్రధాని మోడీ సమావేశం
- డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాల పై అవగాహన అవసరం: డా.జి.దీప
- అబుదాబిలో ఘనంగా 12వ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- Dh103,880 విలువైన వాచీల బ్యాగ్ను తిరిగిచ్చిన పోలీసులు..!!
- కువైట్ లో విదేశీ పెట్టుబడిదారులకు 15 ఏళ్ల రెసిడెన్సీ..!!









