నేటి నుంచే మహిళల ప్రపంచకప్
- June 23, 2017
డర్బీ: ప్రపంచకప్ క్వాలిఫయింగ్ టోర్నీ విజేతగా నిలిచిన భారత మహిళల జట్టు.. వన్డే ప్రపంచకప్లో నేడు టైటిల్ వేట మొదలెట్టనున్నది. ప్రస్తుతం మంచి ఫామ్లో ఉన్న మిథాలీరాజ్ సేన తొలి మ్యాచ్లో ఆతిథ్య ఇంగ్లాండ్తో తలపడనున్నది. నేడు జరిగే మరో మ్యాచ్లో న్యూజిలాండ్, శ్రీలంక మహిళలు పోటీపడనున్నారు. కెప్టెన్ మిథాలీరాజ్ సహా హర్మన్ప్రీత్ కౌర్, వేద కృష్ణమూర్తి, స్మృతి మందన, మోన మెష్రమ్లతో కూడిన బ్యాటింగ్ ఆర్డర్ బలంగా ఉంది. జులన్ గోస్వామి, శిఖా పాండే, పూనమ్ యాదవ్లో బౌలింగ్ విభాగం సైతం పటిష్టంగానే కనిపిస్తోంది. బలమైన ఇంగ్లాండ్ను ఓడించాలంటే మిథాలీసేన సమిష్టిగా రాణించాల్సి ఉంటుంది. మ్యాచ్ నేటి మధ్యాహ్నం 3 గంటలకు ఆరంభం కానున్నది.
తాజా వార్తలు
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- NRI TDP గల్ఫ్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఘనంగా సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు
- చర్చలు విఫలమైతే బాంబులే.. ట్రంప్ హెచ్చరిక
- ఇరాన్తో మునుపటి సంబంధాలు అసాధ్యం..!!
- డిఫెన్స్ ఫోర్స్ సన్నద్ధతను సమీక్షించిన కింగ్ హమద్ ..!!
- 1200 ఫ్లైట్స్ నడుపుతున్న జజీరా ఎయిర్వేస్..!!
- సౌదీ అరేబియాలో 1.6% తగ్గిన ప్రాపర్టీ ధరలు..!!
- బర్కాలో ఆసియా దేశస్థుడు అరెస్టు..!!
- ఖతార్కు విదేశీ విమానయాన సంస్థల సేవలు పునరుద్ధరణ..!!
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం









