మెక్సికోలో రెస్టారెంట్పై సాయుధుల దాడి 14 మంది మృతి
- June 25, 2017మెక్సికో:మెక్సికోలోని వెరాక్రుజ్ రాష్ట్రంలో సాయుధ దుండగులు ఓ రెస్టారెంట్పై దాడిచేసి విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో ఓ పోలీస్ కమిషనర్ సహా పద్నాలుగు మందిని హతమార్చారు. మృతుల్లో మరో ఇద్దరు పోలీస్ అధికారులు నలుగురు పిల్లలున్నారు. దేశంలో మాఫియా ముఠాలు పెరిగిపోతున్నాయని, వాటిని ఉక్కుపాదంతో అణచివేస్తామని వెరాక్రుజ్ గవర్నర్ మిగ్వెల్ ఏంజెల్ యూన్స్ అన్నారు. దుండగుల కాల్పుల్లో మరణించిన పోలీస్ కమిషనర్ క్యామిలో కాస్టేగ్న్ రెండు రోజుల క్రితం ఓ కేసు పరిశోధనలో కొన్ని మృతదేహాలను కనుగొన్నాడని చెప్పారు. మాఫియా గ్యాంగ్లు హత్యలకు, కిడ్నాప్లకు, వసూళ్లకు పాల్పడుతూ బీభత్సం సృష్టిస్తున్నాయని, వారిని తుదముట్టించేందుకు ఏం చేసేందుకైనా వెనుకాడము అని గవర్నర్ పేర్కొన్నారు.
తాజా వార్తలు
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..