ఈద్ అల్ ఫితర్ ప్రార్థనల్లో యూఏఈ రూలర్స్
- June 25, 2017యూఏఈ:యూఏఈ ప్రైమ్ మినిస్టర్, వైస్ ప్రెసిడెంట్, దుబాయ్ రూలర్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్, ఈద్ అల్ ఫితర్ ప్రార్థనల్ని ఆదివారం జబీల్ మాస్క్ వద్ద నిర్వహించారు. షేక్ మొహమ్మద్తో కలిసి దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ షేక్ హమదాన్ బిన్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్ కూడా ప్రార్థనలు నిర్వహించారు. వెల్ విషర్స్ నుంచి షేక్ మొహమ్మద్ రంజాన్ శుభాకాంక్షల్ని అందుకున్నారు. జబెల్ మాస్క్ వద్ద పలువురు షేక్ మొహమ్మద్కి రంజాన్ శుభాకాంక్షలు తెలపడంతోపాటుగా, సమర్థ నాయకత్వంలో యూఏఈ మరింత ముందడుగు వేయాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా షేక్ మొహమ్మద్ అక్కడికి వచ్చినవారందరికీ ఈద్ అల్ ఫితర్ శుభాకాంక్షలు తెలిపారు. షేక్ జాయెద్ మాస్క్లో మొహమ్మద్ బిన్ జాయెద్ - ఈద్ అల్ ఫితర్ ప్రేయర్ నిర్వహించారు. పలువురు ప్రముఖులు, అధికారులు, పౌరులు ఈ ప్రార్థనల్లో పాల్గొన్నారు.
తాజా వార్తలు
- భారత దేశ వ్యాప్తంగా నాల్గో విడత పోలింగ్కు సర్వంసిద్ధం..
- పోలింగ్కు పటిష్ట బందోబస్తు: సీపీ తరుణ్ జోషి
- రూ.4వేల ఆసరా పెన్షన్.. మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక ప్రకటన
- జార్జియా: ప్రభుత్వానికి వ్యతిరేకంగా వీధుల్లోకి వచ్చిన 50 వేల మంది
- అమెరికాలో ఇద్దరు తెలుగు విద్యార్థులు మృతి
- సౌదీలో BON TUM మయోనైజ్ పై నిషేధం
- రస్ అల్ ఖైమాలో గాయపడ్డ వ్యక్తి ఎయిర్లిఫ్ట్
- మే14 వరకు ‘మ్యాంగో మానియా’ మహోత్సవం
- విదేశీయుల నియామకం..రెస్టారెంట్ యజమానికి భారీ ఫైన్
- ఒమన్ను సందర్శించిన ప్రముఖ భారతీయ సామాజిక కార్యకర్తలు