తెలంగాణ రాష్ట్రంలో సినిమా టికెట్ల ధర పెంపు!

- June 26, 2017 , by Maagulf
తెలంగాణ రాష్ట్రంలో సినిమా టికెట్ల ధర పెంపు!

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో సినిమా టిక్కెట్ల ధరలు పెంచినట్టు తెలుస్తోంది. జీహెచ్ఎంసీ పరిధిలోని ఏసీ థియేటర్లలో ఫస్ట్క్లాస్ టికెట్ ధరను రూ.120కు పెంచగా.. లోయర్ క్లాస్ టికెట్ ధరను రూ.40కి పెంచినట్టు సమాచారం. అలాగే మున్సిపాలిటీ పరిధిలోని ఏసీ థియేటర్లలో ఫస్ట్క్లాస్ టికెట్ ధర రూ.80 కాగా, లోయర్ క్లాస్ టికెట్ ధర రూ.30గా నిర్ణయించారట. పంచాయతీ పరిధిలోని ఏసీ థియేటర్లలో ఫస్ట్క్లాస్ టికెట్ ధరను రూ.70కి పెంచగా.. లోయర్ క్లాస్ టికెట్ ధరను రూ.20కి పెంచినట్టు తెలుస్తోంది.
జులై 1వ తేదీ నుంచి జీఎస్టీ అమలులోకి రానుంది. ఈ నేపథ్యంలో తదనుగుణంగా టిక్కెట్ల ధరల్లో మార్పులు చేసినట్లు తెలుస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com