ఆన్ లైన్ లో డీజే మూవీ.. షాక్ తిన్న చిత్ర యూనిట్

- June 26, 2017 , by Maagulf
ఆన్ లైన్ లో  డీజే మూవీ.. షాక్ తిన్న చిత్ర యూనిట్

సినిమా ఇండస్ట్రీకి పట్టిన వైరెస్.. పైరసీ.. అన్నీ భాషల సినిమాలూ.. పైరసీ బాధితులే.. కానీ దక్షిణాది సినిమాలే ఎక్కువగా ఈ పైరసీ వల్ల నష్టబోతున్నాయి. సినిమా రిలీజ్ కు ముందే కొన్ని సీన్స్ రిలీజ్ కావడం సహజమైపోయింది.. ఇప్పుడు తాజాగా డీజే సినిమా మొత్తం ఎవరో ఆన్ లైన్ లో పెట్టేశారు... అదీ సోషల్ మీడియా ఫేస్ బుక్ లో మొత్తం సినిమా పెట్టడంతో.. అందరూ షాక్ తిన్నారు.. పెట్టిన అరగంటలోనే పదివేల వ్యూస్ తో ఉన్న ఈ వీడియో లింక్ కోసం అందరూ వెదికి చూశారు.. ముఖ్యంగా ఆన్ లైన్ లో పెట్టిన ఈ డీజే సినిమా క్వాలిటీ... బాగుండడం.. వాయిస్ క్లారిటీ ఉండడంతో వీక్షకుల సంఖ్య అధికంగా ఉంది.. కాగా ఈ విషయం అభిమానుల ద్వారా తెలుసుకొన్న డీజే బృదం వెంటనే ఎవరు ఆన్ లైన్ లో పెట్టరో తెలుసుకొనే పనిలో పడింది.. దీనికి కంతటికీ కారణం.. సినిమా థియేటర్ లో అత్యాధునిక స్మార్ట్ ఫోన్లు తీసుకొని వెళ్ళి.. రహస్యంగా చిత్రీకరించి ఇటువంటి పనులకు పాల్పడుతున్నారని .. షేర్ ఇట్ వంతో యాప్ లతో క్షణాల్లో పక్కవారితో షేర్ చేసుకోవడం ఈగా మారింది.. ఈ నేపద్యంలో ఇటువంటి పైరసీని ప్రభుత్వ పరంగా అదుపు చేసేలా చర్యలు తీసుకోవాలని.. లేదంటే అదుపు చెయ్యడం కష్టం అని అంటున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com