పాట చిత్రీకరణలో హీరో గోపీచంద్ చిత్రం 'గౌతమ్నంద'.

- June 26, 2017 , by Maagulf
పాట చిత్రీకరణలో హీరో గోపీచంద్  చిత్రం 'గౌతమ్నంద'.

గోపీచంద్ హీరోగా నటిస్తున్న చిత్రం 'గౌతమ్నంద'. సంపత్ నంది దర్శకుడు. శ్రీబాలాజి సినీ మీడియా పతాకంపై జె.భగవాన్, జి.పుల్లారావు నిర్మిస్తున్నారు. ఇప్పటికే టాకీ పార్ట్ చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ చిత్రం కోసం బ్యాలెన్స్ ఉన్న పాటని చిత్రీకరిస్తున్నారు. " బోలే రామ్ బోలే." రామ్ పల్లవితో సాగే ఈ పాటని గోపీచంద్, హన్సిక పాల్గొంటున్నారు.
నిర్మాతలు మాట్లాడుతూ "రొమాంటిక్ పాటల చిత్రీకరణలో తనదైన ముద్రవేసిన సంపత్నంది 'రచ్చ' సినిమాలో "వాన వాన.", 'బెంగాల్ టైగర్'లో "చూపులతో దీపాల.." పాటల స్థాయిలోనే గౌతమ్నంద పాట ఉంటుంది. యువ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకునే రీతిలో రామజోగయ్య శాస్త్రి రాసిన ఈ పాటకు బృందం నేతృత్వంలో చిత్రీకరించాం. ఇందుకోసం ప్రత్యేకమైన సెట్ వేశాం. జులైలో గౌతమ్ నంద ప్రేక్షకుల ముందుకువస్తున్నాడు" అని చెప్పారు. 
ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: ఎస్. సౌందర్రాజన్, కథ, స్క్రీన్ప్లే, మాటలు, దర్శకత్వం : సంపత్ నంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com