ఆర్థిక ఇబ్బందులతో స్టాఫ్ని తొలగించిన అల్ వసాత్
- June 27, 2017
మనామా: స్థానిక అరబిక్ డైలీ తమ సిబ్బందిని తొలగించే పనిలో బిజీగా ఉంది. అధికారిక వర్గాలు ఈ పత్రికపై సస్పెన్షన్ వేటు వేయడంతో నిర్వహణా సమస్యలతో సిబ్బందిని తొలగించాల్సి వస్తోంది. సుమారుగా 180 మంది సిబ్బందిని ఇప్పటికే తొలగించారు. అందులో 39 మంది వలసదారులున్నారు. బోర్డ్ ఛైర్మన్ అదెల్ అల్ మస్తకి, స్టాఫ్ని ఉద్దేశించి పేర్కొన్న విషయమేమిటంటే, ఎంప్లాయిమెంట్ కాంట్రాక్ట్స్ని ఎంప్లాయీస్తో రద్దు చేస్తున్నట్లు తెలిపారు. అల్ వసత్ అధినేత దార్ అల్ వాసత్కి ఎదురైన నష్టాలతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అల్ మస్కతి పేర్కొన్నారు. జూన్ 4న ఇన్ఫర్మేషన్ ఎఫైర్స్ అథారిటీ ఈ న్యూస్ పేపర్ని రద్దు చేసింది. సమాజంలో చీలిక తెచ్చేందుకు ప్రయత్నిస్తోందనీ, బహ్రెయిన్కి ఇతర దేశాలతో సంబంధాల్ని దెబ్బతీసేలా వ్యవహరిస్తోందని అభియోగాలు ఎదుర్కొంటోంది ఈ పత్రిక. పత్రికలో ఓ కాలమిస్ట్, మొరాకోలోని పరిస్థితుల్ని విమర్శించడంతో అధికారిక వర్గాలు చర్యలకు ఉపక్రమించాయి.
తాజా వార్తలు
- క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్..2027 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల
- సాహ్ల్ ద్వారా డొమెస్టిక్ వర్కర్లు, డ్రైవర్ల స్పాన్సర్షిప్ బదిలీ..!!
- షార్జాలో హత్యకు గురైన భారతీయుడి మృతదేహం స్వదేశానికి తరలింపు..!!
- ఏప్రిల్లో 16% పెరిగి SR14.7 బిలియన్లకు చేరిన రెమిటెన్స్..!!
- ఆన్లైన్లో ఉగ్రవాద సంబంధిత దుస్తులు సేల్..ముగ్గురు అరెస్టు..!!
- ఒమన్ సాంస్కృతిక వారసత్వ హోదా పటిష్టం..!!
- డ్రైవర్కు 3 నెలల జైలు శిక్ష విధించిన దుబాయ్ కోర్టు..!!
- ఖతార్ లో అత్యధిక ఉష్ణోగ్రతలు, దుమ్ము తుఫాన్ల అలెర్ట్..!!
- హైదరాబాద్ కు రూ.లక్ష కోట్లు కేటాయించండి..ప్రధాని మోదీని కోరిన సీఎం రేవంత్
- అమెరికా దాడిలో వైజాగ్ వాసి మృతి









