ఆర్థిక ఇబ్బందులతో స్టాఫ్ని తొలగించిన అల్ వసాత్
- June 27, 2017
మనామా: స్థానిక అరబిక్ డైలీ తమ సిబ్బందిని తొలగించే పనిలో బిజీగా ఉంది. అధికారిక వర్గాలు ఈ పత్రికపై సస్పెన్షన్ వేటు వేయడంతో నిర్వహణా సమస్యలతో సిబ్బందిని తొలగించాల్సి వస్తోంది. సుమారుగా 180 మంది సిబ్బందిని ఇప్పటికే తొలగించారు. అందులో 39 మంది వలసదారులున్నారు. బోర్డ్ ఛైర్మన్ అదెల్ అల్ మస్తకి, స్టాఫ్ని ఉద్దేశించి పేర్కొన్న విషయమేమిటంటే, ఎంప్లాయిమెంట్ కాంట్రాక్ట్స్ని ఎంప్లాయీస్తో రద్దు చేస్తున్నట్లు తెలిపారు. అల్ వసత్ అధినేత దార్ అల్ వాసత్కి ఎదురైన నష్టాలతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అల్ మస్కతి పేర్కొన్నారు. జూన్ 4న ఇన్ఫర్మేషన్ ఎఫైర్స్ అథారిటీ ఈ న్యూస్ పేపర్ని రద్దు చేసింది. సమాజంలో చీలిక తెచ్చేందుకు ప్రయత్నిస్తోందనీ, బహ్రెయిన్కి ఇతర దేశాలతో సంబంధాల్ని దెబ్బతీసేలా వ్యవహరిస్తోందని అభియోగాలు ఎదుర్కొంటోంది ఈ పత్రిక. పత్రికలో ఓ కాలమిస్ట్, మొరాకోలోని పరిస్థితుల్ని విమర్శించడంతో అధికారిక వర్గాలు చర్యలకు ఉపక్రమించాయి.
తాజా వార్తలు
- వాంఖడేలో సూర్య ప్రతాపం..అమెరికా పై భారత్ సంచలన విజయం
- ఇంటర్నేషనల్ బందర్ పోర్టు పనుల పరిశీలన చేసిన ఎంపీ బాలశౌరి
- జూబ్లీహిల్స్ వేంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు-షెడ్యూల్ ఇదే
- ఫిబ్రవరి 11న సెలవు ఇవ్వాలని SEC ఆదేశం
- సెంట్రల్ లెదర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ఉద్యోగాలు
- అమరావతి క్వాంటం వ్యాలీ శంకుస్థాపన
- వింటర్ ఒలింపిక్ 2026 ప్రారంభోత్సవం.. అమీర్ హాజరు..!!
- రికార్డులు బ్రేక్ చేసిన సౌదీ అరేబియా రైల్వే..!!
- దుబాయ్ స్కూళ్లలో రమదాన్ స్పెషల్ షెడ్యూల్..!!
- షేల్ ఆయిల్, గ్యాస్..అమెరికా సంస్థలతో కువైట్ చర్చలు..!!









