ఆర్థిక ఇబ్బందులతో స్టాఫ్ని తొలగించిన అల్ వసాత్
- June 27, 2017
మనామా: స్థానిక అరబిక్ డైలీ తమ సిబ్బందిని తొలగించే పనిలో బిజీగా ఉంది. అధికారిక వర్గాలు ఈ పత్రికపై సస్పెన్షన్ వేటు వేయడంతో నిర్వహణా సమస్యలతో సిబ్బందిని తొలగించాల్సి వస్తోంది. సుమారుగా 180 మంది సిబ్బందిని ఇప్పటికే తొలగించారు. అందులో 39 మంది వలసదారులున్నారు. బోర్డ్ ఛైర్మన్ అదెల్ అల్ మస్తకి, స్టాఫ్ని ఉద్దేశించి పేర్కొన్న విషయమేమిటంటే, ఎంప్లాయిమెంట్ కాంట్రాక్ట్స్ని ఎంప్లాయీస్తో రద్దు చేస్తున్నట్లు తెలిపారు. అల్ వసత్ అధినేత దార్ అల్ వాసత్కి ఎదురైన నష్టాలతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అల్ మస్కతి పేర్కొన్నారు. జూన్ 4న ఇన్ఫర్మేషన్ ఎఫైర్స్ అథారిటీ ఈ న్యూస్ పేపర్ని రద్దు చేసింది. సమాజంలో చీలిక తెచ్చేందుకు ప్రయత్నిస్తోందనీ, బహ్రెయిన్కి ఇతర దేశాలతో సంబంధాల్ని దెబ్బతీసేలా వ్యవహరిస్తోందని అభియోగాలు ఎదుర్కొంటోంది ఈ పత్రిక. పత్రికలో ఓ కాలమిస్ట్, మొరాకోలోని పరిస్థితుల్ని విమర్శించడంతో అధికారిక వర్గాలు చర్యలకు ఉపక్రమించాయి.
తాజా వార్తలు
- తెలంగాణలో పెట్టుబడులకు ఇదే సరైన సమయం: సీఎం రేవంత్
- సాంకేతికతతో భవిష్యత్ పోలీసింగ్కు పోలీసులు సిద్ధం కావాలి: డీజీపీ సీవీ ఆనంద్
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్కాందే బాధ్యత
- కువైట్లో స్మార్ట్ ట్రాఫిక్ సిగ్నళ్లు..!!
- మెసైమీర్ ఇంటర్చేంజ్ టన్నెల్ తాత్కాలికంగా మూసివేత..!!
- ఒమన్లో కఠిన చట్టం.. OMR100,000 వరకు జరిమానా..!!
- 50 డిగ్రీల వేడిలోనూ యూఏఈలో వర్షాలు..!!
- ఆన్లైన్ యాప్లతో హ్యూమన్ ట్రాఫికింగ్ ముప్పు పెరుగుతోంది..!!







