ఉదయ్ కిరణ్ పేరు మీద అవార్డులు ప్రదానం
- June 27, 2017
హైదరాబాద్: 'చిత్రం', 'నువ్వు-నేను', 'మనసంతా నువ్వే' చిత్రాలతో వరుస విజయాలు అందుకున్న నటుడు ఉదయ కిరణ్. జూన్ 26న ఆయన జయంతి సందర్భంగా హైదరాబాద్లోని ప్రసాద్ల్యాబ్లో నివాళులర్పించారు. నిర్మాత ఎన్.ఎస్. నాయక్, సందీప్ రెడ్డి, వీరేశ్ గౌడ్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. 'మా' అధ్యక్షుడు శివాజీరాజా, నటుడు చంద్రమోహన్, దర్శకుడు వి.ఎన్. ఆదిత్య, సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ తదితరులు కార్యక్రమానికి హాజరై ఉదయ్కిరణ్కు నివాళులర్పించారు. ఉదయ్కిరణ్తో తమకున్న అనుబంధాన్ని తెలియజేశారు.
ఈ సందర్భంగా 'ఉదయ్ కిరణ్ సినీ అవార్డ్స్-2017' విజేతలకు జ్ఞాపికలు అందజేశారు. ఆనంద్ కుమార్ తెరకెక్కించిన 'ప్రజాహక్కు'కు ఉత్తమ లఘు చిత్రం అవార్డు దక్కింది. వి. అవంతిక, ఎ. హాసిని ఉత్తమ బాలనటి అవార్డులు అందుకున్నారు.
ఆనంద్ కుమార్ ఉత్తమ దర్శకుడిగా అవార్డు పొందారు.
తాజా వార్తలు
- AVPN హెల్త్ ఇంపాక్ట్ లీడర్షిప్ ఫోరం
- అండర్-19 వన్డే వరల్డ్ కప్ విజేత భారత్..
- ఇరాన్తో రహస్య చర్చలు, ట్రంప్ అసలు డిమాండ్లు ఏంటి?
- ఏపీ రవాణా శాఖ కీలక అడుగు..
- మసీదులో భారీ పేలుడు..పలువురు మృతి
- జగన్ పరామర్శ యాత్రలో ఇద్దరు మృతి
- BJP మేనిఫెస్టో విడుదల చేసిన రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు
- జర్నలిస్టులకు శుభవార్త..9 నుంచి అక్రిడిటేషన్లకు దరఖాస్తు స్వీకరణ
- అల్మాటీలో 2029 ఆసియా వింటర్ గేమ్స్..!!
- కింగ్ సల్మాన్ రాయల్ రిజర్వ్ లోకి యానిమల్స్ రిలీజ్..!!









