జీఎస్టీ పై వ్యాపారుల నిరసన
- June 27, 2017
జీఎస్టీ అమలుకు సమయం దగ్గరపడుతున్న కొద్ది వ్యాపార వర్గాల నుంచి నిరసన పెరుగుతోంది. జీఎస్టీతో నష్టం కలుగుతుందంటూ తెలుగు రాష్ట్రాల్లో వస్త్ర వ్యాపారులు మూడు రోజుల బంద్కు పిలుపునివ్వగా.. ఫర్నిచర్ వ్యాపారులు కూడా గత రెండ్రోజులుగా ఆందోళనకు దిగారు.
జీఎస్టీని నిరసిస్తూ తెలుగు రాష్ట్రాల్లో వ్యాపారుల ఆందోళన ఉద్ధృతమైంది. వస్తు సేవల పన్నులకు వ్యతిరేకంగా వస్త్ర వ్యాపారులు మూడు రోజుల బంద్కు పిలుపునిచ్చారు. షాపులు మూసివేసి తమ నిరసనను తెలియజేశారు. బంద్ ప్రభావంతో రద్దీగా కనిపించే వీధులన్నీ బోసిపోయాయి. అక్కడక్కడా వ్యాపారులు నల్ల జెండాలతో వ్యాపారులు తమ నిరసనను తెలియజేశారు. కేంద్రం వస్త్రాలను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావడాన్ని వ్యాపారులు వ్యతిరేకిస్తున్నారు. కేంద్ర వెంటనే ఈ నిర్ణయాన్ని ఎత్తివేయాలని డిమాండ్ చేస్తున్నారు. .నిర్ణయాన్ని వెనక్కు తీసుకునే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామంటున్నారు. వస్త్రాలపై జీఎస్టీ విధిస్తే వ్యాపారులతో పాటు వినియోగదారులు నష్టపోతారంటున్నారు. జీఎస్టీపై కేంద్రం వెనక్కు తగ్గకపోతే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామంటున్నారు.
జీఎస్టీ అమలుకు సమయం దగ్గరపడడంతో ఫర్నిచర్ వ్యాపారుల నుంచి కూడా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. తెలుగు రాష్ట్రాల్లో గత రెండ్రోజులుగా ఆందోళనలు చేస్తున్నా ఫర్నిచర్ వ్యాపారులు.. 28 శాతం జీఎస్టీతో వ్యాపారం దెబ్బతింటుదని, దానిని 18 శాతానికి తగ్గించాలని డిమాండ్ చేస్తున్నారు.a
తాజా వార్తలు
- తెలంగాణలో పెట్టుబడులకు ఇదే సరైన సమయం: సీఎం రేవంత్
- సాంకేతికతతో భవిష్యత్ పోలీసింగ్కు పోలీసులు సిద్ధం కావాలి: డీజీపీ సీవీ ఆనంద్
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్కాందే బాధ్యత
- కువైట్లో స్మార్ట్ ట్రాఫిక్ సిగ్నళ్లు..!!
- మెసైమీర్ ఇంటర్చేంజ్ టన్నెల్ తాత్కాలికంగా మూసివేత..!!
- ఒమన్లో కఠిన చట్టం.. OMR100,000 వరకు జరిమానా..!!
- 50 డిగ్రీల వేడిలోనూ యూఏఈలో వర్షాలు..!!
- ఆన్లైన్ యాప్లతో హ్యూమన్ ట్రాఫికింగ్ ముప్పు పెరుగుతోంది..!!







