జీఎస్టీ పై వ్యాపారుల నిరసన
- June 27, 2017
జీఎస్టీ అమలుకు సమయం దగ్గరపడుతున్న కొద్ది వ్యాపార వర్గాల నుంచి నిరసన పెరుగుతోంది. జీఎస్టీతో నష్టం కలుగుతుందంటూ తెలుగు రాష్ట్రాల్లో వస్త్ర వ్యాపారులు మూడు రోజుల బంద్కు పిలుపునివ్వగా.. ఫర్నిచర్ వ్యాపారులు కూడా గత రెండ్రోజులుగా ఆందోళనకు దిగారు.
జీఎస్టీని నిరసిస్తూ తెలుగు రాష్ట్రాల్లో వ్యాపారుల ఆందోళన ఉద్ధృతమైంది. వస్తు సేవల పన్నులకు వ్యతిరేకంగా వస్త్ర వ్యాపారులు మూడు రోజుల బంద్కు పిలుపునిచ్చారు. షాపులు మూసివేసి తమ నిరసనను తెలియజేశారు. బంద్ ప్రభావంతో రద్దీగా కనిపించే వీధులన్నీ బోసిపోయాయి. అక్కడక్కడా వ్యాపారులు నల్ల జెండాలతో వ్యాపారులు తమ నిరసనను తెలియజేశారు. కేంద్రం వస్త్రాలను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావడాన్ని వ్యాపారులు వ్యతిరేకిస్తున్నారు. కేంద్ర వెంటనే ఈ నిర్ణయాన్ని ఎత్తివేయాలని డిమాండ్ చేస్తున్నారు. .నిర్ణయాన్ని వెనక్కు తీసుకునే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామంటున్నారు. వస్త్రాలపై జీఎస్టీ విధిస్తే వ్యాపారులతో పాటు వినియోగదారులు నష్టపోతారంటున్నారు. జీఎస్టీపై కేంద్రం వెనక్కు తగ్గకపోతే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామంటున్నారు.
జీఎస్టీ అమలుకు సమయం దగ్గరపడడంతో ఫర్నిచర్ వ్యాపారుల నుంచి కూడా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. తెలుగు రాష్ట్రాల్లో గత రెండ్రోజులుగా ఆందోళనలు చేస్తున్నా ఫర్నిచర్ వ్యాపారులు.. 28 శాతం జీఎస్టీతో వ్యాపారం దెబ్బతింటుదని, దానిని 18 శాతానికి తగ్గించాలని డిమాండ్ చేస్తున్నారు.a
తాజా వార్తలు
- IPL 2026: లక్నో పై పంజాబ్ ఘన విజయం
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం
- దుబాయ్, మనామా, ఖసాబ్కు విమానాలు తిరిగి ప్రారంభించిన ఒమాన్ ఎయిర్వేస్
- సీఎం చంద్రబాబు బర్త్డే సీడీపీ వచ్చేసింది!
- బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు..19 మంది మృతి
- 'వారాహి హోమియోపతి’ చికిత్స కేంద్రం ప్రారంభం
- దేశంలోనే తొలి LED క్రెడిట్ కార్డు లాంచ్..ఫీచర్లు ఇవే!
- ఆల్ ఇండియా పర్మిట్ రద్దు చేసిన కేంద్రం!
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం









