ఎయిర్ అంబులెన్సు సర్వీస్ ను మొదలుపెట్టిన అపోలో హాస్పిటల్
- June 28, 2017
అత్యవసరంగా వైద్య సేవలు అందించడానికి గతంలో ప్రారంభించిన ఎయిర్ అంబులెన్స్ సేవలను ద్వితీయ శ్రేణి నగరాలకు విస్తరించనున్నట్లు ప్రముఖ వైద్యారోగ్య సేవల సంస్థ అపోలో హాస్పిటల్స్ ప్రకటించింది. బెంగళూరుకు చెందిన విమానయాన సంస్థ ఏవియేటర్స్ ఎయిర్ రెస్క్యూతో కలిసి నిర్వహిస్తున్న ఈ సేవలను కరీంనగర్తోపాటు కాకినాడ, వైజాగ్, కరైకుడి, కరూర్, మధురై, తిరుచిరాపల్లి, మైసూర్ నగరాల్లో త్వరలో అందుబాటులోకి రానున్నట్లు అపోలో హాస్పిటల్స్ వైస్-చైర్మన్ ప్రీథా రెడ్డి తెలిపారు.
ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన హెలికాప్టర్ల ద్వారా ప్రయాణ సమయం 90 శాతం వరకు తగ్గనుండగా, అలాగే అత్యవసరంగా మెడికల్ సేవలు అందించడానికి వీలుంటుందని ఆమె వెల్లడించారు. ఇందుకోసం గంటకు రూ.1.60 లక్షల నుంచి రూ.2 లక్షల వరకు చార్జీ చేయనున్నట్లు ఆమె తెలిపారు. కాగా, 2003లోనే ఎయిర్ అంబులన్స్ సర్వీసులను అపోలో హాస్పిటల్స్ ప్రారంభించింది. న్యూఢిల్లీ, బెంగూళరు లాంటి నగరాలకు మొదట విస్తరించింది. ఏడాదిలో 125-150మంది రోగులను ఈ సర్వీసుల ద్వారా చేరవేస్తోంది.
తాజా వార్తలు
- మలేషియాలో ఘోర అగ్నిప్రమాదం..వెయ్యి ఇళ్లు దగ్ధం
- అమెరికాలో మాస్ షూటింగ్…8 చిన్నారులు మృతి
- ఘర్రాఫత్ అల్ రాయన్ ఇంటర్చేంజ్ వద్ద రోడ్ మూసివేత..!!
- సౌదీ అరేబియాలో ఉరుములతో కూడిన వర్షాలు..!!
- యూఏఈలో నిత్యావసర వస్తువుల ధరలను పోల్చడానికి కొత్త వేదిక..!!
- ఒమన్ మానవ హక్కుల కమిషన్ (OHRC) పునర్నిర్మాణం..!!
- జాతీయ భద్రతా ఉల్లంఘనలపై తక్షణ చర్యలకు ఆదేశాలు..!!
- ఎయిర్ పోర్ట్ సంసిద్ధతను పరిశీలించిన కువైట్ పీఎం..!!
- IPL 2026: లక్నో పై పంజాబ్ ఘన విజయం
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం









