ఎయిర్ అంబులెన్సు సర్వీస్ ను మొదలుపెట్టిన అపోలో హాస్పిటల్
- June 28, 2017
అత్యవసరంగా వైద్య సేవలు అందించడానికి గతంలో ప్రారంభించిన ఎయిర్ అంబులెన్స్ సేవలను ద్వితీయ శ్రేణి నగరాలకు విస్తరించనున్నట్లు ప్రముఖ వైద్యారోగ్య సేవల సంస్థ అపోలో హాస్పిటల్స్ ప్రకటించింది. బెంగళూరుకు చెందిన విమానయాన సంస్థ ఏవియేటర్స్ ఎయిర్ రెస్క్యూతో కలిసి నిర్వహిస్తున్న ఈ సేవలను కరీంనగర్తోపాటు కాకినాడ, వైజాగ్, కరైకుడి, కరూర్, మధురై, తిరుచిరాపల్లి, మైసూర్ నగరాల్లో త్వరలో అందుబాటులోకి రానున్నట్లు అపోలో హాస్పిటల్స్ వైస్-చైర్మన్ ప్రీథా రెడ్డి తెలిపారు.
ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన హెలికాప్టర్ల ద్వారా ప్రయాణ సమయం 90 శాతం వరకు తగ్గనుండగా, అలాగే అత్యవసరంగా మెడికల్ సేవలు అందించడానికి వీలుంటుందని ఆమె వెల్లడించారు. ఇందుకోసం గంటకు రూ.1.60 లక్షల నుంచి రూ.2 లక్షల వరకు చార్జీ చేయనున్నట్లు ఆమె తెలిపారు. కాగా, 2003లోనే ఎయిర్ అంబులన్స్ సర్వీసులను అపోలో హాస్పిటల్స్ ప్రారంభించింది. న్యూఢిల్లీ, బెంగూళరు లాంటి నగరాలకు మొదట విస్తరించింది. ఏడాదిలో 125-150మంది రోగులను ఈ సర్వీసుల ద్వారా చేరవేస్తోంది.
తాజా వార్తలు
- క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్..2027 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల
- సాహ్ల్ ద్వారా డొమెస్టిక్ వర్కర్లు, డ్రైవర్ల స్పాన్సర్షిప్ బదిలీ..!!
- షార్జాలో హత్యకు గురైన భారతీయుడి మృతదేహం స్వదేశానికి తరలింపు..!!
- ఏప్రిల్లో 16% పెరిగి SR14.7 బిలియన్లకు చేరిన రెమిటెన్స్..!!
- ఆన్లైన్లో ఉగ్రవాద సంబంధిత దుస్తులు సేల్..ముగ్గురు అరెస్టు..!!
- ఒమన్ సాంస్కృతిక వారసత్వ హోదా పటిష్టం..!!
- డ్రైవర్కు 3 నెలల జైలు శిక్ష విధించిన దుబాయ్ కోర్టు..!!
- ఖతార్ లో అత్యధిక ఉష్ణోగ్రతలు, దుమ్ము తుఫాన్ల అలెర్ట్..!!
- హైదరాబాద్ కు రూ.లక్ష కోట్లు కేటాయించండి..ప్రధాని మోదీని కోరిన సీఎం రేవంత్
- అమెరికా దాడిలో వైజాగ్ వాసి మృతి









