ఎయిర్ అంబులెన్సు సర్వీస్ ను మొదలుపెట్టిన అపోలో హాస్పిటల్
- June 28, 2017
అత్యవసరంగా వైద్య సేవలు అందించడానికి గతంలో ప్రారంభించిన ఎయిర్ అంబులెన్స్ సేవలను ద్వితీయ శ్రేణి నగరాలకు విస్తరించనున్నట్లు ప్రముఖ వైద్యారోగ్య సేవల సంస్థ అపోలో హాస్పిటల్స్ ప్రకటించింది. బెంగళూరుకు చెందిన విమానయాన సంస్థ ఏవియేటర్స్ ఎయిర్ రెస్క్యూతో కలిసి నిర్వహిస్తున్న ఈ సేవలను కరీంనగర్తోపాటు కాకినాడ, వైజాగ్, కరైకుడి, కరూర్, మధురై, తిరుచిరాపల్లి, మైసూర్ నగరాల్లో త్వరలో అందుబాటులోకి రానున్నట్లు అపోలో హాస్పిటల్స్ వైస్-చైర్మన్ ప్రీథా రెడ్డి తెలిపారు.
ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన హెలికాప్టర్ల ద్వారా ప్రయాణ సమయం 90 శాతం వరకు తగ్గనుండగా, అలాగే అత్యవసరంగా మెడికల్ సేవలు అందించడానికి వీలుంటుందని ఆమె వెల్లడించారు. ఇందుకోసం గంటకు రూ.1.60 లక్షల నుంచి రూ.2 లక్షల వరకు చార్జీ చేయనున్నట్లు ఆమె తెలిపారు. కాగా, 2003లోనే ఎయిర్ అంబులన్స్ సర్వీసులను అపోలో హాస్పిటల్స్ ప్రారంభించింది. న్యూఢిల్లీ, బెంగూళరు లాంటి నగరాలకు మొదట విస్తరించింది. ఏడాదిలో 125-150మంది రోగులను ఈ సర్వీసుల ద్వారా చేరవేస్తోంది.
తాజా వార్తలు
- పర్యాటక రంగ బ్రాండింగ్, మార్కెటింగ్ కోసం రూ.150 కోట్ల ప్రతిపాదన
- రోడ్డు ప్రమాద బాధితులకు ‘గోల్డెన్ అవర్’ చికిత్స: మంత్రి నితిన్
- 25,000 ఉద్యోగాల భర్తీకి కాగ్నిజెంట్ నిర్ణయం
- ఖతార్ లో అంతర్జాతీయ ఖర్జూర ఎగ్జిబిషన్ ప్రారంభం..!!
- అరేబియన్ గల్ఫ్ సెక్యూరిటీ 4..ఆకట్టుకున్న సైనిక విన్యాసాలు..!!
- ముహారక్లో కొత్త లెఫ్ట్-టర్న్ లేన్లు ఓపెన్..!!
- సహల్ యాప్ ద్వారా పాస్పోర్ట్ అప్డేట్..!!
- నా కూతురే అదృష్టాన్ని తెచ్చింది: dh20 మిలియన్ విజేత..!!
- క్యామెల్ పాస్ పోర్ట్ ను ప్రారంభించిన సౌదీ అరేబియా..!!
- ఫైనల్ కి చేరుకున్న భారత్







