'జైలవకుశ' లీక్
- June 28, 2017
ఎన్టీఆర్ కథానాయకుడుగా నటిస్తున్న చిత్రం 'జై లవకుశ'. బాబీ దర్శకుడు. ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై కల్యాణ్రామ్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం టీజర్ను జులై మొదటి వారంలో విడుదల చేస్తున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. కాగా చిత్రంలోని కొన్ని సన్నివేశాలను కొందరు ఆన్లైన్లో లీక్ చేశారు. చిత్ర బృందం సోషల్మీడియా ద్వారా ఈ విషయాన్ని ప్రకటించింది. ''జై లవకుశ'లోని సన్నివేశాలను లీక్ చేసిన కొంతమంది నిందితులను గుర్తించి, అరెస్టు చేయించాం' అని ఎన్టీఆర్ ఆర్ట్స్ ట్వీట్ చేసింది.'జై లవకుశ' సన్నివేశాల లీక్ చేసిన ప్రధాన నిందితుడు గణేశ్ అని, అతడ్ని అరెస్టు చేయించామని చిత్ర బృందం తాజాగా తెలిపింది. ఈ మేరకు దర్యాప్తు జరుగుతోందని పేర్కొంది. లీకైన సన్నివేశాలు అధికారిక టీజర్లోనివి కాదని, కేవలం రఫ్ కట్ మాత్రమే అని చెప్పింది. దయచేసి లీకైన ఫొటోలను షేర్ చేయొద్దని సినీ అభిమానులను చిత్ర బృందం కోరింది.రాశీఖన్నా, నివేదా థామస్ ఇందులో కథానాయికలుగా నటిస్తున్నారు. ఎన్టీఆర్ త్రిపాత్రాభినయంలో కనిపించనున్నారు. బుల్లితెర హిందీ నటుడు రోనిత్ రాయ్ ప్రతినాయకుడి పాత్ర పోషిస్తున్నారు. నందిత కీలక పాత్ర పోషిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ బాణీలు అందిస్తున్నారు. సెప్టెంబర్ 21న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
తాజా వార్తలు
- క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్..2027 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల
- సాహ్ల్ ద్వారా డొమెస్టిక్ వర్కర్లు, డ్రైవర్ల స్పాన్సర్షిప్ బదిలీ..!!
- షార్జాలో హత్యకు గురైన భారతీయుడి మృతదేహం స్వదేశానికి తరలింపు..!!
- ఏప్రిల్లో 16% పెరిగి SR14.7 బిలియన్లకు చేరిన రెమిటెన్స్..!!
- ఆన్లైన్లో ఉగ్రవాద సంబంధిత దుస్తులు సేల్..ముగ్గురు అరెస్టు..!!
- ఒమన్ సాంస్కృతిక వారసత్వ హోదా పటిష్టం..!!
- డ్రైవర్కు 3 నెలల జైలు శిక్ష విధించిన దుబాయ్ కోర్టు..!!
- ఖతార్ లో అత్యధిక ఉష్ణోగ్రతలు, దుమ్ము తుఫాన్ల అలెర్ట్..!!
- హైదరాబాద్ కు రూ.లక్ష కోట్లు కేటాయించండి..ప్రధాని మోదీని కోరిన సీఎం రేవంత్
- అమెరికా దాడిలో వైజాగ్ వాసి మృతి









