షార్జాలో ట్యాక్సీ ఫేర్లు పెరగనున్నాయి
- October 15, 2015
షార్జాలో ఇక నుంచి ఫేర్లు పెరగనున్నాయి. 10 దిర్హామ్లనుంచి 11.50 దిర్హామ్లకు మినిమమ్ ట్యాక్సీ ఫేర్ పెరిగింది. ఇంధన ధరల పెరుగుదల నేపథ్యంలో ట్యాక్సీ ఫేర్లు పెంచవలసి వచ్చిందని అధికారిక వర్గాలు వెల్లడించాయి. అయితే పెంచిన ధరలతోనూ తమకు నష్టాలు తప్పడంలేదని ట్యాక్సీ నిర్వాహకులు చెబుతున్నారు. అయితే ప్రయాణీకులు మాత్రం పెరిగిన ధరల పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అన్ని రకాల ధరలూ పెరుగుతుండడంతో జీవనం కష్టమవుతోందని ప్రయాణీకులు చెప్పారు. మినిమమ్ ఛార్జీల్లో మార్పులున్నా, తదనంతరం చెల్లించాల్సిన ధరల్లో పెద్దగా మార్పులు చేయలేదు. మినిమమ్ ఛార్జి తర్వాత ప్రతి పాయింట్కీ 3.5 దిర్హామ్లు పగలు, 4 దిర్హామ్లు రాత్రి పూట పాత పద్ధతిలోనే ప్రయాణీకులు, ట్యాక్సీలకు చల్లించవలసి ఉంటుంది.
తాజా వార్తలు
- దుబాయ్ సౌత్లో వర్క్షాప్ ప్రమాదంతో భారీ అగ్నిప్రమాదం.. పలు ట్రక్కులు, కారవాన్లు దగ్ధం
- హీట్ ఎగ్జాస్షన్, చర్మ గాయాలపై యూఏఈ నిపుణుల హెచ్చరిక..!!
- ఒమాన్లో పొగమంచు హెచ్చరిక జారీ..!!
- మద్యం మత్తులో డ్రైవింగ్.. ఒకరి మృతి, 8 మందికి గాయాలు..!!
- ఖతార్ ఎయిర్వేస్ విమానాల్లో ‘నబ్ద్ ఖతార్’ అనుభవం..!!
- అనుమతి లేని ప్రాంతాల్లో ఈతకు వెళ్లొద్దు..!!
- షేక్ జాబర్ బ్రిడ్జిపైనుంచి జంప్.. మహిళ ఆత్మహత్యాయత్నం..!!
- యూఏఈలో టెలీమార్కెటింగ్ నిబంధనల ఉల్లంఘనపై కఠిన చర్యలు..
- ‘ఆధార్’ పేరిట ఆ మెసేజ్ లు నమ్మవద్దు–తెలంగాణ పోలీస్
- CJP తీరు పై స్టూడెంట్స్ విమర్శలు!







