మొదటి వారంలో కరీంనగరానికి సీఎం కేసీఆర్
- June 29, 2017
సీఎం కేసీఆర్రాకకు కరీంనగరం ముస్తాబతోంది. హరితహారం, పలు అభివృద్ధి పనులు ప్రారంభం, శంకుస్థాపనలు చేసేందుకు జూలై మొదటి వారంలో జిల్లా కేంద్రానికి రానున్నారు. ఈ మేరకు అధికారులు, నాయకులు నగరంలో వీధులు అందంగా తీర్చిదిద్దే పనిలో పడ్డారు. ముఖ్య కూడళ్లలో మొక్కలు నాటుతున్నారు. బస్టాండ్, గీతాభవన్, కోర్టు, కమాన్ చౌరస్తాల్లో పచ్చదనాన్ని నింపుతున్నారు. రోడ్లు, భవనాల శాఖ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న ప్రధాన రహదారుల మధ్యలో మట్టి నింపుతున్నారు. ఇందులో మొక్కలు నాటే పనిలో పడ్డారు. ప్రభుత్వ ప్రహారీ గోడలకు తెలంగాణ కళాకృతులు ఉట్టిపడేలా పేయింటింగ్ వేయిస్తున్నారు. అనుమతి లేకుండా పోస్టర్లు అంటిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తానని నగరపాలక సంస్థ కమిషనర్ శశాంక ఇప్పటికే హెచ్చరించిన విషయం తెలిసిందే. స్మార్ట్సిటీగా ఎంపికైన నేపథ్యంలో కొత్త ఉత్సాహంలో పాలకవర్గం పనిచేస్తున్నట్టు స్పష్టమవుతోంది. హరితహారం పథకం కరీంనగర్ నుంచే ప్రారంభిస్తానని, ఒకే రోజు లక్ష మొక్కలు నాటాలని ముఖ్యమంత్రి ప్రకటించారు. ఇందులో నగరపాలక సంస్థనే కాకుండా ఇతర ప్రభుత్వ శాఖలను భాగస్వామ్యం చేస్తున్నారు. అందులో పోలీసు శాఖ నగరంలోని పది డివిజన్లను దత్తత తీసుకుంది.
స్వయంగా పోలీసు కమిషనర్ కమలాసన్ రెడ్డి పలు డివిజన్లలో పర్యటించి మొక్కలు నాటే అనువైన స్థలాలను గుర్తించారు. పరిరక్షణకు పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నట్టు ప్రకటించారు. నగరానికి వరాలు కురిపించి పెద్ద మొత్తంలో నిధులు విడుదల చేసిన నేపథ్యంలో ముఖ్యమంత్రి రాకకు మేయర్, పాలక వర్గం పెద్దఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు.
తాజా వార్తలు
- క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్..2027 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల
- సాహ్ల్ ద్వారా డొమెస్టిక్ వర్కర్లు, డ్రైవర్ల స్పాన్సర్షిప్ బదిలీ..!!
- షార్జాలో హత్యకు గురైన భారతీయుడి మృతదేహం స్వదేశానికి తరలింపు..!!
- ఏప్రిల్లో 16% పెరిగి SR14.7 బిలియన్లకు చేరిన రెమిటెన్స్..!!
- ఆన్లైన్లో ఉగ్రవాద సంబంధిత దుస్తులు సేల్..ముగ్గురు అరెస్టు..!!
- ఒమన్ సాంస్కృతిక వారసత్వ హోదా పటిష్టం..!!
- డ్రైవర్కు 3 నెలల జైలు శిక్ష విధించిన దుబాయ్ కోర్టు..!!
- ఖతార్ లో అత్యధిక ఉష్ణోగ్రతలు, దుమ్ము తుఫాన్ల అలెర్ట్..!!
- హైదరాబాద్ కు రూ.లక్ష కోట్లు కేటాయించండి..ప్రధాని మోదీని కోరిన సీఎం రేవంత్
- అమెరికా దాడిలో వైజాగ్ వాసి మృతి









