ప్రముఖ హాస్య నటుడు ఫృథ్వికి కోర్టు దిమ్మతిరిగే షాక్!
- June 29, 2017
ప్రముఖ హాస్య నటుడు పృద్వీరాజ్ కు కోర్టు పెద్ద భాద్యతే పెట్టింది. ఆయన తన భార్యకు నెలకు ఎనిమిది లక్షల రూపాయల చొప్పున చెల్లించాలని వివజయవాడ కుటుంబ కోర్టు ఆదేశాలు ఇచ్చింది.పృద్వీరాజ్ కు విజయవాడ అరండల్ పేటకు చెందిన శ్రీలక్మితో 1984 లో పెళ్లి జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు. కొంతకాలం పాటు వీరిద్దరు స్వీట్ షాప్ నడిపారు.ఆ దశలో పృద్వీరాజ్ నటనపై ఆసక్తితో హైదరాబాద్ కు మకాం మార్చారు.ఆ తరవ్ఆత వీరిద్దరికి గొడవలు వచ్చాయి. పృద్వీరాజ్ వ్యసనాలకు అలవాటు పడ్డారని అభియోగం.వీరిమద్య రాజీయత్నాలు కూడా ఫలించలేదు.దాంతో శ్రీలక్మీ విజయవాడకు వచ్చేశారు.ఆ తర్వాత ఏ ప్రయత్నానికి పృద్వీరాజ్ అంగీకరించకపోవడంతో అతనిపై ఆమె కేసు పెట్టారు.తన జీవనోపాది నిమిత్తం నెలకు పది లక్షల రూపాయలు ఇప్పించాలని ఆమె కోరారు.ఈ కేసును విచారణ చేసిన కోర్టు,వాయిదాలకు కూడా పృద్వీరాజ్ రాకపోవడంతో శ్రీలక్మికి ఎనిమిది లక్షల పరిహారం ఇవ్వాలని ఆదేశిస్తూ తీర్పు ఇచ్చారు. ఆయన అంత ఇవ్వగలుగుతారో ,లేదో కాని, కోర్టు నోటీసులకు స్పందించకపోవడంతో అలాంటి ఆదేశాలు వచ్చాయని అనుకోవచ్చేమో!
తాజా వార్తలు
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్కాందే బాధ్యత
- కువైట్లో స్మార్ట్ ట్రాఫిక్ సిగ్నళ్లు..!!
- మెసైమీర్ ఇంటర్చేంజ్ టన్నెల్ తాత్కాలికంగా మూసివేత..!!
- ఒమన్లో కఠిన చట్టం.. OMR100,000 వరకు జరిమానా..!!
- 50 డిగ్రీల వేడిలోనూ యూఏఈలో వర్షాలు..!!
- ఆన్లైన్ యాప్లతో హ్యూమన్ ట్రాఫికింగ్ ముప్పు పెరుగుతోంది..!!
- సౌదీ నేతృత్వంలో సముద్ర రక్షణ కూటమి ఏర్పాటు..!!
- బహ్రెయిన్ షీల్డ్ సంయుక్త సైనిక విన్యాసాలకు షేక్ హమ్దాన్ హాజరు..







