ప్రముఖ హాస్య నటుడు ఫృథ్వికి కోర్టు దిమ్మతిరిగే షాక్!

- June 29, 2017 , by Maagulf
ప్రముఖ హాస్య నటుడు ఫృథ్వికి కోర్టు దిమ్మతిరిగే షాక్!

ప్రముఖ హాస్య నటుడు పృద్వీరాజ్ కు కోర్టు పెద్ద భాద్యతే పెట్టింది. ఆయన తన భార్యకు నెలకు ఎనిమిది లక్షల రూపాయల చొప్పున చెల్లించాలని వివజయవాడ కుటుంబ కోర్టు ఆదేశాలు ఇచ్చింది.పృద్వీరాజ్ కు విజయవాడ అరండల్ పేటకు చెందిన శ్రీలక్మితో 1984 లో పెళ్లి జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు. కొంతకాలం పాటు వీరిద్దరు స్వీట్ షాప్ నడిపారు.ఆ దశలో పృద్వీరాజ్ నటనపై ఆసక్తితో హైదరాబాద్ కు మకాం మార్చారు.ఆ తరవ్ఆత వీరిద్దరికి గొడవలు వచ్చాయి. పృద్వీరాజ్ వ్యసనాలకు అలవాటు పడ్డారని అభియోగం.వీరిమద్య రాజీయత్నాలు కూడా ఫలించలేదు.దాంతో శ్రీలక్మీ విజయవాడకు వచ్చేశారు.ఆ తర్వాత ఏ ప్రయత్నానికి పృద్వీరాజ్ అంగీకరించకపోవడంతో అతనిపై ఆమె కేసు పెట్టారు.తన జీవనోపాది నిమిత్తం నెలకు పది లక్షల రూపాయలు ఇప్పించాలని ఆమె కోరారు.ఈ కేసును విచారణ చేసిన కోర్టు,వాయిదాలకు కూడా పృద్వీరాజ్ రాకపోవడంతో శ్రీలక్మికి ఎనిమిది లక్షల పరిహారం ఇవ్వాలని ఆదేశిస్తూ తీర్పు ఇచ్చారు. ఆయన అంత ఇవ్వగలుగుతారో ,లేదో కాని, కోర్టు నోటీసులకు స్పందించకపోవడంతో అలాంటి ఆదేశాలు వచ్చాయని అనుకోవచ్చేమో!

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com