జీఎస్టీ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని బాయ్ కాట్ చేయాలని కాంగ్రెస్ నిర్ణయించింది
- June 29, 2017
రేపు అర్ధరాత్రి జరగనున్న జీఎస్టీ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని బాయ్ కాట్ చేయాలని కాంగ్రెస్ నిర్ణయించింది. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ తో కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ కొద్ది సేపటి కిందట భేటీ అయ్యారు. ఈ భేటీలో జీఎస్టీ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని బాయ్ కాట్ చేయాలని నిర్ణయించారు. దేశ వ్యాప్తంగాజులై 1 నుంచి జీఎస్టీ అమలులోనికి రానున్నసందర్భంగా కేంద్ర ప్రభుత్వం రేపు అర్ధరాత్రి జీఎస్టీ ఆరంభ సంబరాన్ని ఘనంగా నిర్వహించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ కార్యక్రమానికి గైర్హాజర్ కానున్నట్లు తృణమూల్ కాంగ్రెస్ ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా ఇప్పుడు కాంగ్రెస్ కూడా ఈ కార్యక్రమాన్ని బాయ్ కాట్ చేయాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని కాంగ్రెస్ ప్రతినిథి సత్యవ్రత్ చతుర్వేది విలేకరులతో తెలిపారు.
తాజా వార్తలు
- ప్రవాస భారతీయులకు బడ్జెట్ కానుక
- వాట్సాప్ నుంచి కొత్త పెయిడ్ ప్లాన్!
- యూఏఈ స్కూల్ అడ్మిషన్లలో కొత్త రూల్స్
- హైదరాబాద్ టూ బెంగళూరు కేవలం 2 గంటలే..
- షేక్ హసీనాకు 10 సంవత్సరాలు జైలు శిక్ష
- 16వ ఆర్థిక సంఘం నివేదిక పై లోక్సభలో ఎంపీ బాలాశౌరి ప్రశ్న
- అగ్నివీర్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..
- వెబ్ సమ్మిట్: టెక్ స్టార్టప్లకు $2 బిలియన్ల ప్రోత్సాహం..!!
- సౌదీలో 127 మంది ప్రభుత్వ ఉద్యోగులు అరెస్టు..!!
- యూఏఈలో గోల్డ్, సిల్వర్ అమ్ముతున్న నివాసితులు..!!







