ఎయిర్ ఇండియా రేసులో ఇండిగో
- June 29, 2017
ప్రభుత్వ రంగ విమానయాన సంస్థను ఎయిర్ ఇండియాను కొనుగోలు చేసేందుకు ప్రయివేటు ఎయిర్లైన్స్ సంస్థ ఆసక్తి కనబరుస్తోంది. అప్పుల సంక్షోభంలో ఇరుక్కున్న ఎయిర్ ఇండియాపై దేశీయ ఎయిర్లైన్స్ , బడ్జెట్ క్యారియర్ ఇండిగో ముందుకు వచ్చింది. ఈ మేరకు ప్రభుత్వానికి ఇండిగో లేఖ రాసినట్టు సమాచారం.
ఎయిర్ ఇండియా ప్రయివేటీకరణకు కేంద్ర క్యాబినెట్ ఇలా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందో లేదో (24గం.ల్లోపే) అలా సంస్థలు క్యూ కడుతున్నాయి. ముఖ్యంగా మార్కెట్ వాటా పరంగా అతిపెద్ద ఎయిర్లైన్స్ ఇండిగో ఈ రేసులో ముందు వరసలో ఉండటం విశేషం.
ఎయిర్ ఇండియా కొనుగోలుకు ఇండిగో ఆసక్తిగా ఉందని సెంట్రల్ ఏవియేషన్ సెక్రటరీ ఆర్ఎన్ చౌబే గురువారం ప్రకటించారు. వీటితోపాటు ఇతర దేశీయ, అంతర్జాతీయ విమాన సంస్థల ద్వారా ఈ ఆఫర్లు కూడా అనధికారికంగా ప్రకటించాయని చెప్పారు. దీనిపై క్యాబినెట్ శుక్రవారం నిర్ణయం తీసుకోనుందని తెలిపారు. అలాగే టాటా గ్రూపు నుంచి తమకు ఎలాంటి ప్రతిపాదనలు అందలేదన్నారు.
మరోవైపు ఎయిర్ ఇండియాను టాటా గ్రూప్ కొనుగోలు చేయవచ్చని మీడియా నివేదికలు గుప్పుమన్నాయి. అయితే ఈ వార్తలపై టాటా ఇంకా స్పందించలేదు.కాగా ఎయిర్ ఇండియా పెట్టుబడుల ఉపసంహరణకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం గత రాత్రి (బుధవారం) ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- ఏకైక గ్రౌండ్ హ్యాండ్లింగ్ ప్రొవైడర్గా కువైట్ ఎయిర్వేస్..!!
- సౌదీలో హెయిలింగ్ డ్రైవర్ల కోసం ఫేషియల్ రికగ్నిషన్..!!
- కార్మికులు ఏడాది సర్వీస్ తర్వాత యజమానులను మార్చుకోవచ్చు..!!
- భారత బడ్జెట్ 2026: ఎన్నారై పెట్టుబడులకు ఊతం..!!
- నాగా అల్ సహ్లా స్ట్రీట్ తాత్కాలిక మూసివేత..!!
- క్రిటికల్ కేసుల రవాణాకు కొత్త టెక్నాలజీ..SQUH
- అంబటి రాంబాబు ఇంటి పై దాడి..హైకోర్టు సీరియస్
- ఇది ఫార్వర్డ్ లుకింగ్ బడ్జెట్: సీఎం చంద్రబాబు
- టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ బదిలీ...రవిచంద్రకు బాధ్యతలు
- ఫోన్ ట్యాపింగ్ కేసు.. KCR విచారణ ప్రారంభం







