ఎయిర్ ఇండియా రేసులో ఇండిగో
- June 29, 2017
ప్రభుత్వ రంగ విమానయాన సంస్థను ఎయిర్ ఇండియాను కొనుగోలు చేసేందుకు ప్రయివేటు ఎయిర్లైన్స్ సంస్థ ఆసక్తి కనబరుస్తోంది. అప్పుల సంక్షోభంలో ఇరుక్కున్న ఎయిర్ ఇండియాపై దేశీయ ఎయిర్లైన్స్ , బడ్జెట్ క్యారియర్ ఇండిగో ముందుకు వచ్చింది. ఈ మేరకు ప్రభుత్వానికి ఇండిగో లేఖ రాసినట్టు సమాచారం.
ఎయిర్ ఇండియా ప్రయివేటీకరణకు కేంద్ర క్యాబినెట్ ఇలా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందో లేదో (24గం.ల్లోపే) అలా సంస్థలు క్యూ కడుతున్నాయి. ముఖ్యంగా మార్కెట్ వాటా పరంగా అతిపెద్ద ఎయిర్లైన్స్ ఇండిగో ఈ రేసులో ముందు వరసలో ఉండటం విశేషం.
ఎయిర్ ఇండియా కొనుగోలుకు ఇండిగో ఆసక్తిగా ఉందని సెంట్రల్ ఏవియేషన్ సెక్రటరీ ఆర్ఎన్ చౌబే గురువారం ప్రకటించారు. వీటితోపాటు ఇతర దేశీయ, అంతర్జాతీయ విమాన సంస్థల ద్వారా ఈ ఆఫర్లు కూడా అనధికారికంగా ప్రకటించాయని చెప్పారు. దీనిపై క్యాబినెట్ శుక్రవారం నిర్ణయం తీసుకోనుందని తెలిపారు. అలాగే టాటా గ్రూపు నుంచి తమకు ఎలాంటి ప్రతిపాదనలు అందలేదన్నారు.
మరోవైపు ఎయిర్ ఇండియాను టాటా గ్రూప్ కొనుగోలు చేయవచ్చని మీడియా నివేదికలు గుప్పుమన్నాయి. అయితే ఈ వార్తలపై టాటా ఇంకా స్పందించలేదు.కాగా ఎయిర్ ఇండియా పెట్టుబడుల ఉపసంహరణకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం గత రాత్రి (బుధవారం) ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్..2027 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల
- సాహ్ల్ ద్వారా డొమెస్టిక్ వర్కర్లు, డ్రైవర్ల స్పాన్సర్షిప్ బదిలీ..!!
- షార్జాలో హత్యకు గురైన భారతీయుడి మృతదేహం స్వదేశానికి తరలింపు..!!
- ఏప్రిల్లో 16% పెరిగి SR14.7 బిలియన్లకు చేరిన రెమిటెన్స్..!!
- ఆన్లైన్లో ఉగ్రవాద సంబంధిత దుస్తులు సేల్..ముగ్గురు అరెస్టు..!!
- ఒమన్ సాంస్కృతిక వారసత్వ హోదా పటిష్టం..!!
- డ్రైవర్కు 3 నెలల జైలు శిక్ష విధించిన దుబాయ్ కోర్టు..!!
- ఖతార్ లో అత్యధిక ఉష్ణోగ్రతలు, దుమ్ము తుఫాన్ల అలెర్ట్..!!
- హైదరాబాద్ కు రూ.లక్ష కోట్లు కేటాయించండి..ప్రధాని మోదీని కోరిన సీఎం రేవంత్
- అమెరికా దాడిలో వైజాగ్ వాసి మృతి









