యూఏఈ లో చిక్కుకున్న భారతీయులు
- July 02, 2017
దుబాయ్: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో ఉన్న 22 నౌకల్లో దాదాపు 100 మంది భారతీయ నావికులు చిక్కుకున్నట్లు దుబాయ్లోని భారతీయ దౌత్య కార్యాలయ అధికారి విపుల్ వెల్లడించారు. నౌకల్లో చిక్కుకుపోయిన నావికులు తమకు ఫోన్ చేసి రక్షించాల్సిందిగా కోరినట్లు విపుల్ తెలిపారు. '22 నౌకల్లో దాదాపు 97 మంది నావికులు చిక్కుకున్నట్లు మాకు సమాచారం వచ్చింది. ఇతర దేశాలకు సంబంధించి ఎంత మంది ఉన్నారనే సమాచారం మాత్రం మా దగ్గర లేదు. శ్రీలంక, ఫిలిప్పీన్స్, మయన్మార్, పాకిస్థాన్కు చెందిన నావికులు' కూడా ఈ నౌకల్లో ఉన్నట్లు సమాచారం.
నౌకల్లో పని చేసేందుకు వెళ్లిన తమకు గత కొన్ని నెలలుగా జీతాలు ఇవ్వడం లేదని, ఆహారం, తాగేందుకు మంచినీళ్లు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు నావికులు తమకు ఫిర్యాదు చేసినట్లు దౌత్య కార్యాలయం వెల్లడించింది. ఎక్కువ మంది జీతాలు ఇవ్వడం లేదనే ఫిర్యాదులు చేస్తున్నారు, యజమానుల దగ్గర నుంచి జీతాలు ఇప్పిస్తే తమ తమ స్వస్థలాలకు వెళ్లిపోతామని నావికులు చెప్పినట్లు గల్ఫ్న్యూస్ తెలిపింది. నావికులను తీసుకెళ్లిన యజమానులు, ఏజెంట్లతో మాట్లాడేందుకు ప్రయత్నిస్తున్నామని, వేరే నౌకల ద్వారా ఆహారం, మంచి నీళ్లు పంపించినట్లు దౌత్యాధికారి పేర్కొన్నారు.
పని చేయించేందుకు తీసుకెళ్లి జీతాలు ఇవ్వకుండా, తిండి పెట్టకుండా ప్రవర్తిస్తున్న కంపెనీ యజమానులు, ఏజెంట్లపై కఠినమైన చర్యలు తీసుకోవాలని అక్కడ పనిచేస్తున్న భారతీయ కార్మికుడు గిరిష్ పంత్ డిమాండ్ చేశారు. కొన్ని నౌకల్లో ఇంధనం అయిపోవడంతో జనరేటర్లు కూడా తిరగడం లేదు, దాని వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తోందని గిరిష్ చెప్పాడు.
తాజా వార్తలు
- తెలంగాణలో పెట్టుబడులకు ఇదే సరైన సమయం: సీఎం రేవంత్
- సాంకేతికతతో భవిష్యత్ పోలీసింగ్కు పోలీసులు సిద్ధం కావాలి: డీజీపీ సీవీ ఆనంద్
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్కాందే బాధ్యత
- కువైట్లో స్మార్ట్ ట్రాఫిక్ సిగ్నళ్లు..!!
- మెసైమీర్ ఇంటర్చేంజ్ టన్నెల్ తాత్కాలికంగా మూసివేత..!!
- ఒమన్లో కఠిన చట్టం.. OMR100,000 వరకు జరిమానా..!!
- 50 డిగ్రీల వేడిలోనూ యూఏఈలో వర్షాలు..!!
- ఆన్లైన్ యాప్లతో హ్యూమన్ ట్రాఫికింగ్ ముప్పు పెరుగుతోంది..!!







