షార్జాలో తగ్గిన రోడ్డు ప్రమాదాలు
- July 02, 2017
షార్జాలో ఈ ఏడాది తొలి అర్థ భాగంలో రోడ్డు ప్రమాదాలు కొంతవరకు తగ్గినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. గత ఏడాది ఇదే సమయానికి 69 మరణాలు రోడ్డు ప్రమాదాల కారణంగా జరిగితే, ఈ ఏడాది ఆ సంఖ్య 60 గా నమోదయ్యింది. రోడ్ సేఫ్టీకి సంబంధించి తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలను ఇస్తున్నాయని అధికారులు తెలిపారు. అయినప్పటికీ కూడా రహదారి భద్రతపై మరింత అవగాహన అవసరమని వారు చెప్పారు. షార్జా పోలీస్, డైరెక్టర్ ఆఫ్ ట్రాఫిక్ అండ్ పెట్రోల్ డిపార్ట్మెంట్ మేజర్ జనరల్ అలై అల్ నక్బి మాట్లాడుతూ, రోడ్డు ప్రమాదాల్ని నివారించేందుకు అత్యంత వ్యూహాత్మకంగా పలు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. డిపార్ట్మెంట్ పరంగా ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికీ, వాహనదారుల్లో చైతన్యమే రోడ్డు ప్రమాదాలను తగ్గిస్తుందని, ఆ కారనంగానే అవగాహన కార్యక్రమాల్ని విస్తృతంగా చేపడుతున్నామని ఆయన వివరించారు.
తాజా వార్తలు
- విరమణ పొందిన ఏడుగురు పోలీసు అధికారులకు ఘన వీడ్కోలు.. సేవలను కొనియాడిన సైబరాబాద్ సీపీ డా. రమేష్
- డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తుదారులకు అలర్ట్.. ఆర్టీఓ కొత్త రూల్స్..
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు టీటీడీ భారీ ఏర్పాట్లు
- ప్రధాని మోదీ పర్యటనకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు: డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
- భోగాపురం ఎయిర్పోర్ట్ ఏర్పాట్ల పై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్
- తెలంగాణలో పెట్టుబడులకు ఇదే సరైన సమయం: సీఎం రేవంత్
- సాంకేతికతతో భవిష్యత్ పోలీసింగ్కు పోలీసులు సిద్ధం కావాలి: డీజీపీ సీవీ ఆనంద్
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్కాందే బాధ్యత







