దేశం విడిచివెళ్ళేవారికి ఖతార్ ఆంక్షలు
- July 02, 2017
ఖతార్ ప్రభుత్వం తమ పౌరులు, నివాసితులు దేశం విడిచి వెళ్ళేందుకు ఆంక్షలు విధించింది. కొన్ని విభాగాలకు చెందినవారికి లీవ్ మంజూరు చేయకుండా చర్యలు చేపట్టింది. ప్రభుత్వ శాఖలకు చెందినవారిపై ఈ బ్యాన్ విధించడం జరిగింది. దేశంలో ప్రత్యేక పరిస్థితుల కారణంగా పౌరులు, నివాసితులకు ఎలాంటి సమస్యలూ రాకుండా చూసే ఉద్దేశ్యంతోనే ఈ చర్యలు చేపట్టినట్లు అధికారిక వర్గాలు వెల్లడిస్తున్నాయి. అయితే సంక్షోభం నుంచి గట్టెక్కే మార్గం కనిపించకపోవడంతో ఖతార్, తమ ప్రజలు నివాసితులపై ఉక్కుపాదం మోపుతోందన్న విమర్శలు వినవస్తున్నాయి. ఖతార్ తీవ్రవాదానికి వెన్నుదన్నుగా నిలుస్తోందంటూ, ఖతార్తో సంబంధాల్ని పలు దేశాలు తెగతెంపులు చేసుకున్న దరిమిలా ఖతార్లో పరిస్థితులు కొంత ఆందోళనకంగా మారాయి. అయితే ఖతార్ మాత్రం తమ దేశంలో పౌరులు, నివాసితులు ఎవరూ ఆందోళన చెందే పరిస్థితులు లేవనీ, తమ ఆర్థిక వ్యవస్థ అత్యంత పరిపుష్టంగా ఉందని చెబుతోంది. ఎవరెంతలా తమతో సంబంధాలు తెంచేసుకున్నా ఏళ్ళ తరబడి ధైర్యంగా మనుగడ సాధించే శక్తి ఉందన్నది ఖతార్ వాదన. కానీ పరిశీలకుల వాదన ఇంకోలా ఉంది. ఖతార్ ప్రభుత్వంలో ఆందోళన పెరిగిందనీ, అభద్రతాభావంతోనే పౌరులకు సెలవుల్ని రద్దు చేసిందని అంచనా వేస్తున్నారు.
తాజా వార్తలు
- AI డీప్ఫేక్ మోసాల పట్ల కేంద్రం కీలక హెచ్చరిక
- సూడాన్లో డ్రోన్ దాడిలో 15 మంది మృత్యువాత..
- అమరావతికి భారీ నిధులు..రూ.2,534 కోట్లతో కొత్త ప్రాజెక్టులు షురూ!
- అమెరికా వీసా కోసం నెలల వెయిటింగ్? ఇకపై ఫాస్ట్ ట్రాక్ మార్గం ఇదే!
- ప్రపంచంలోనే తొలి ట్రిలియనీర్గా ఎలాన్ మస్క్
- క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్..2027 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల
- సాహ్ల్ ద్వారా డొమెస్టిక్ వర్కర్లు, డ్రైవర్ల స్పాన్సర్షిప్ బదిలీ..!!
- షార్జాలో హత్యకు గురైన భారతీయుడి మృతదేహం స్వదేశానికి తరలింపు..!!
- ఏప్రిల్లో 16% పెరిగి SR14.7 బిలియన్లకు చేరిన రెమిటెన్స్..!!
- ఆన్లైన్లో ఉగ్రవాద సంబంధిత దుస్తులు సేల్..ముగ్గురు అరెస్టు..!!









