డిస్ట్రిబ్యూషన్ రంగంలోకి ప్రముఖ పీఆర్ఓ
- July 04, 2017
హైదరాబాద్: సినిమా నిర్మాణం కంటే డిస్ట్రిబ్యూషన్ చాలా కష్టమని అంటుంటారు. ఆడియన్స్ పల్స్ పట్టుకోవడం అంత తేలిక కాదు. అలా పట్టుకున్నవారే మంచి డిస్ట్రిబ్యూటర్లుగా పేరు సంపాదించుకుంటారు. సినిమా మీద ప్యాషన్తో ఎంతోమంది ఈ రంగంలోకి రావడం, అట్నుంచటే సినీ నిర్మాణంవైపు అడుగులు వేయడం చూస్తున్నాం. ప్రముఖ నిర్మాతల్లో ఒకరైన దిల్ రాజు కూడా డిస్ట్రిబ్యూషన్ రంగంలోంచే నిర్మాణ రంగం వైపుకు వచ్చారు. ఇంకెందరో ఉన్నారు ఈ బాటలో. లేటెస్ట్గా రవి పనస అనే పీఆర్ఓ సినీ డిస్ట్రిబ్యూషన్ వైపు అడుగులేస్తున్నారు. సినీ పరిశ్రమలో రవి పనస ప్రతి ఒక్కరికీ తెలిసిన వ్యక్తే. అందరితో సత్సంబంధాలు ఆయన ప్రత్యేకం. సినీ రంగంలో అపార అనుభవం సొంతం చేసుకున్న తర్వాత డిస్ట్రిబ్యూషన్ రంగంలోకి అడుగుపెట్టాలనుకున్నారాయన. క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ రూపొందిస్తున్న 'నక్షత్రం' సినిమాతో డిస్ట్రిబ్యూటర్గా మారుతున్నారు రవి పనస. ఆడియన్స్ పల్స్ తెలిసిన వ్యక్తిగా, రవి పనస ఫిలిం కార్పొరేషన్ (ఆర్పిఎఫ్సి) స్థాపించి, డిస్ట్రిబ్యూటర్గా మారబోతున్నారాయన. నైజాంలో దిల్ రాజు, సుధాకర్రెడ్డి, నామా అభిషేక్ వంటివారు డిస్ట్రిబ్యూటర్లుగా టాప్ స్లాట్లో ఉన్నారు. వారి సరసన రవి పనస చేరాలని, తొలి సినిమాతోనే ఘనవిజయాన్ని అందుకోవాలని ఆకాంక్షిద్దాం.
తాజా వార్తలు
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్కాందే బాధ్యత
- కువైట్లో స్మార్ట్ ట్రాఫిక్ సిగ్నళ్లు..!!
- మెసైమీర్ ఇంటర్చేంజ్ టన్నెల్ తాత్కాలికంగా మూసివేత..!!
- ఒమన్లో కఠిన చట్టం.. OMR100,000 వరకు జరిమానా..!!
- 50 డిగ్రీల వేడిలోనూ యూఏఈలో వర్షాలు..!!
- ఆన్లైన్ యాప్లతో హ్యూమన్ ట్రాఫికింగ్ ముప్పు పెరుగుతోంది..!!
- సౌదీ నేతృత్వంలో సముద్ర రక్షణ కూటమి ఏర్పాటు..!!
- బహ్రెయిన్ షీల్డ్ సంయుక్త సైనిక విన్యాసాలకు షేక్ హమ్దాన్ హాజరు..







