పోలీస్ స్టేషన్లలో మల్టీ స్టోరీ పార్కింగ్
- July 04, 2017
పోలీస్ స్టేషన్లకు దగ్గరలో పార్కింగ్ కోసం ఇకపై పెద్దగా ప్రయాస ఉండకపోవచ్చు. దుబాయ్ పోలీసులు, ఈ మేరకు కసరత్తులు ప్రారంభించారు. పోలీస్ స్టేషన్ని సందర్శించేవారికి పార్కింగ్ సమస్యలను తగ్గించడం కోసం మల్టీ స్టోరీ స్మార్ట్ పార్కింగ్ సిస్టమ్తో చెక్ పెడతామని దుబాయ్ పోలీస్ కమాండర్ ఇన్ చీఫ్ మేజర్ జనరల్ అబ్దుల్లా ఖలీఫా అల్ మెర్రి చెప్పారు. నైఫ్, రిఫ్ఫా, మురాఖాబాత్ పోలీస్ స్టేషన్లలో తొలి ఫేజ్లో భాగంగా ఈ ప్రాజెక్టుని అమలు చేయనున్నారు. స్మార్ట్ పోలీసింగ్లో భాగంగా ఈ స్మార్ట్ పార్కింగ్ని సందర్శకుల కోసం రూపొందిస్తున్నట్లు దుబాయ్ పోలీస్ డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూస్ అండ్ ఫండ్ ఇన్ది ఫైనాన్స్ డిపార్ట్మెంట్ బ్రిగేడియర్ నయీమ్ అల్ ఖతీబ్ చెప్పారు. ప్రస్తుతం మల్టీ స్టోరీ స్మార్ట్ పార్కింగ్ కోసం పలు రకాలైన మోడల్స్ని అధ్యయనం చేస్తున్నామనీ, అధ్యయనం పూర్తికాగానే ప్రాజెక్టులను ప్రారంభిస్తామని అన్నారు. స్మార్ట్ మెకానిజం ద్వారా కారు పార్క్ చేయాలనుకున్న వ్యక్తికి ఓ టిక్కెట్ అక్కడిక్కడే ఇవ్వడం జరుగుతుందనీ, ఆ టిక్కెట్ని తిరిగి వెళ్ళే సమయంలో ఇన్సెర్ట్ చేస్తే, ఎవరి ప్రమేయమూ లేకుండా కారు పార్కింగ్ స్లాట్ నుంచి ఆ వ్యక్తికి ఆ కారు అందుతుందని అల్ ఖతీబ్ చెప్పారు.
తాజా వార్తలు
- మళ్లీ దుందుడుకు చర్యలకు పాల్పడ్డ పాకిస్థాన్..
- ప్రపంచ దేశాల సహకారంతోనే ఉగ్రవాదం పై విజయం: మంత్రి జైశంకర్
- సౌదీ అరేబియాలో 'స్పియర్స్ ఆఫ్ విక్టరీ 2026' ప్రారంభం..!!
- ఇండియాకు డబ్బు పంపడానికి ఇదే సరైన సమయమా?
- 8 రోజుల్లో 28వేలకు పైగా ట్రాఫిక్ ఉల్లంఘనలు నమోదు..!!
- UNRWAకు మద్దతు కొనసాగుతుంది: ఖతార్
- రెసిడెన్సీ చెల్లుబాటుకు ఎక్స్ పాట్ ఐడి కార్డు లింక్..!!
- సలాలాకు దక్షిణంగా అరేబియా సముద్రంలో భూకంపం..!!
- ఎన్ విడియా ఉపాధ్యక్షురాలితో సీఎం చంద్రబాబు భేటీ
- ఏప్రిల్ నుంచి యూపీఐ ద్వారా పీఎఫ్ విత్డ్రా







