భారీగా తగ్గిన వెండి ధర
- July 04, 2017
న్యూఢిల్లీ: కమొడిటీ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు భారీ పతనమవుతున్నాయి. వరుసగా రెండో రోజు కూడా పుత్తడి ధరల్లో బలహీన ధోరణి కొనసాగుతుండగా, మరో విలువైన లోహం వెండి ధరలు కూడా మంగళవారం భారీగా పడిపోయాయి. డాలర్ విలువలోపుంజుకున్న బలం, భారీగా తగ్గిన డిమాండ్ కారణంగా కిలో వెండి ధర వెయ్యి రూపాయలకు పైగా నష్టపోయింది.
సిల్వర్ ధర మంగళవారం రూ .39 వేల స్థాయి కిందికి పడిపోయింది. దేశ రాజధానిలో కిలోకు రూ .1,335 నష్టపోయి రూ.38,265గా నమోదైంది. వారాంతపు ఆధారిత డెలివరీ రూ .1,090 తగ్గి రూ .37,265 కు పడిపోయింది. బంగారం ధర 10 గ్రా. రూ.90లు క్షీణించి రూ. 29,310గా నమోదైంది.
అంతర్జాతీయ ప్రతికూల సంకేతాలు పరిశ్రమ దారులనుంచి డిమాండ్ గణనీయంగా క్షీణించిందని ట్రేడర్లు చెప్పారు. దేశీయ మార్కెట్లో నాణెం తయారీదారుల నుంచి డిమాండ్ తగ్గిందని వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా వెండి ధరలు 2.98 శాతం తగ్గి ఔన్స్ధర 16.11 డాలర్లకు చేరుకున్నాయి.. అటు ఔన్స్ బంగారం 1.73 శాతం నష్టపోయి 1,219.70 డాలర్లకు చేరుకుంది. సోమవారం య పుత్తడి ధర 7 వారాల కనిష్టాన్ని నమోదు చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు ఇండిపెండెన్స్ డే సందర్భంగా మంగళవారం అమెరికా మార్కెట్లకు సెలవు.
తాజా వార్తలు
- తెలంగాణతో భాగస్వామ్యానికి గూగుల్ ఆసక్తి
- భారతీయ పారిశ్రామికవేత్తలతో ట్రంప్ సమావేశం
- మీ డ్రైవింగ్ లైసెన్స్లో మొబైల్ నంబర్ను ఆన్లైన్లో ఎలా మార్చాలో తెలుసా?
- పెట్టుబడులకు ఏపీకి మించిన రాష్ట్రం లేదు..దావోస్లో సీఎం చంద్రబాబు
- ఇంటి నుంచే FIR? తెలంగాణ పోలీసుల కొత్త నిర్ణయం
- రియాద్ సీజన్.. 14 మిలియన్లు దాటిన విజిటర్స్..!!
- షార్జాలో పెట్రోల్ స్టేషన్లపై పోలీసుల నిఘా..!!
- ఇండియా నుంచి చేపల దిగుమతికి అనుతించండి..!!
- ఖలీఫా బ్రిడ్జిపై ట్రక్ నిషేధం పొడిగింపు..ట్రాఫిక్ అథారిటీ క్లారిటీ..!!
- కేరళ పౌల్ట్రీ దిగుమతుల పై ఒమన్ నిషేధం..!!







