తమిళనాడు చెన్నైలో 'ఐసిస్' కలకలం
- July 04, 2017
చెన్నైలో మరోసారి 'ఐసిస్' కలకలం రేగింది. నగరంలోని బర్మాబజార్కు చెందిన హరూన్ (30)ని యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ఏటీఎస్) రాజస్థాన్ అధికారులు మంగళవారం తెల్లవారుజామున అదుపులోకి తీసుకున్నారు. ఉగ్రవాద సంస్థ సానుభూతిపరులకు నిధులు ఇస్తూ సహకరిస్తున్నాడన్న సమాచారం మేరకు పక్కా పథకం ప్రకారం ఏటీఎస్ అధికారులు అతడ్ని పట్టుకున్నారు. ఇదివరకే ఏటీఎస్ అదుపులో ఉన్న మహ్మద్ ఇక్బాల్, జమిల్ అహ్మద్ ఇచ్చిన సమాచారంతో స్థానికంగా మొబైల్ దుకాణం నడుపుతున్న హరూన్ను అదుపులోకి తీసుకుని విచారణ నిమిత్తం జయపురకు తరలించారు. గతంలో ఎనిమిది మంది తమిళనాడు యువకులు ఐసిస్లో చేరినట్లు అధికారిక లెక్కల్లో తేలింది. అలాగే ఏడాది క్రితం ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా మచిలీపట్నానికి చెందిన యువకుడు ఫరీద్ రహమాన్ ఐసిస్లో చేరినట్లు పోలీసుల దర్యాప్తుతో వెలుగులోకి వచ్చింది.
తాజా వార్తలు
- Dh103,880 విలువైన వాచీల బ్యాగ్ను తిరిగిచ్చిన పోలీసులు..!!
- కువైట్ లో విదేశీ పెట్టుబడిదారులకు 15 ఏళ్ల రెసిడెన్సీ..!!
- యూఏఈ, ఖతార్ టార్గెట్ కథనాలను ఖండించిన జీసీసీ, అరబ్ పార్లమెంట్..!!
- బహ్రెయిన్ లో కొత్త విద్యా సంవత్సరం సెప్టెంబర్ 3న ప్రారంభం..!!
- AI శిక్షణతో ప్రభుత్వ రంగ సామర్థ్యాలు బలోపేతం..!!
- ఒమన్ తీరంలో భారతీయ నౌక 'విరాట్ 1' మిస్సింగ్..!!
- భారీ వర్షాల నేపథ్యంలో బేగంపేటలో పరిస్థితుల సమీక్షించిన సీపీ సుమతి
- ఏపీ, తెలంగాణకు భారీ వర్ష సూచనా
- జూలై 4 నుంచి అలీ ఖమేనీ అంత్యక్రియలు..ఇరాన్ కీలక ప్రకటన
- తిరుపతి ఫిల్మ్ సిటీ విజన్కు రాష్ట్రవ్యాప్తంగా విశేష స్పందన









