తమిళనాడు చెన్నైలో 'ఐసిస్' కలకలం
- July 04, 2017
చెన్నైలో మరోసారి 'ఐసిస్' కలకలం రేగింది. నగరంలోని బర్మాబజార్కు చెందిన హరూన్ (30)ని యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ఏటీఎస్) రాజస్థాన్ అధికారులు మంగళవారం తెల్లవారుజామున అదుపులోకి తీసుకున్నారు. ఉగ్రవాద సంస్థ సానుభూతిపరులకు నిధులు ఇస్తూ సహకరిస్తున్నాడన్న సమాచారం మేరకు పక్కా పథకం ప్రకారం ఏటీఎస్ అధికారులు అతడ్ని పట్టుకున్నారు. ఇదివరకే ఏటీఎస్ అదుపులో ఉన్న మహ్మద్ ఇక్బాల్, జమిల్ అహ్మద్ ఇచ్చిన సమాచారంతో స్థానికంగా మొబైల్ దుకాణం నడుపుతున్న హరూన్ను అదుపులోకి తీసుకుని విచారణ నిమిత్తం జయపురకు తరలించారు. గతంలో ఎనిమిది మంది తమిళనాడు యువకులు ఐసిస్లో చేరినట్లు అధికారిక లెక్కల్లో తేలింది. అలాగే ఏడాది క్రితం ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా మచిలీపట్నానికి చెందిన యువకుడు ఫరీద్ రహమాన్ ఐసిస్లో చేరినట్లు పోలీసుల దర్యాప్తుతో వెలుగులోకి వచ్చింది.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









