దుబాయ్ ఎయిర్పోర్ట్ని సందర్శించిన షేక్ మొహమ్మద్
- July 07, 2017
యూఏఈ ప్రైమ్ మినిస్టర్, వైస్ ప్రెసిడెంట్, దుబాయ్ రూలర్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్, దుబాయ్ వ్యాప్తంగా పలు చోట్ల ఆకస్మిక పర్యటనలు జరిపారు. షేక్ మొహమ్మద్ వెంట ఆయన కుమారుడు, దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ షేక్ హమదాన్ బిన్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్ కూడా ఉన్నారు. దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ టెర్మినల్ 3 వద్ద రాయల్ ఫ్యామిలీ కనిపించడంతో అక్కడివారంతా ఆశ్చర్యానుభూతులకు లోనయ్యారు. దుబాయ్ మీడియా ఆఫీస్, ఈ మేరకు ఓ ఫొటోని విడుదల చేసింది. ఇన్స్టాగ్రామ్లో వీడియోని పోస్ట్ చేయడం జరిగింది. దుబాయ్ మెట్రోలో కూడా షేక్ మొహమ్మద్ మరియు షేక్ హమదాన్ ప్రయాణించారు. కొన్నాళ్ళ క్రితమే మదినాత్ జుమైరాలోని దుబాయ్ రెస్టారెంట్లోనూ షేక్ మొహమ్మద్ డిన్నర్ చేయడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది.
తాజా వార్తలు
- తిరుమలలో రూమ్ ఎలా పొందాలో తెలుసా?
- ఇరాన్ రెండో దాడితో కువైట్ విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం.. అత్యవసర ప్రణాళికలు అమలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!
- చేపల మార్కెట్లో 3.2 టన్నుల కుళ్లిన చేపలు స్వాధీనం..!!
- రిఫాలో ముగిసిన 'లిటిల్ మునిసిపాలిటీస్ విలేజ్' ఎడిషన్..!!
- ఖతార్ ఎయిర్కండీషన్డ్ పార్కులకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్ పై క్షిపణులు, డ్రోన్ దాడులు..గగనతల రక్షణ వ్యవస్థలు ప్రతిఘటన
- జులై 27న దేశవ్యాప్త బ్యాంక్ సమ్మె..
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!







