దుబాయ్ ఎయిర్పోర్ట్ని సందర్శించిన షేక్ మొహమ్మద్
- July 07, 2017
యూఏఈ ప్రైమ్ మినిస్టర్, వైస్ ప్రెసిడెంట్, దుబాయ్ రూలర్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్, దుబాయ్ వ్యాప్తంగా పలు చోట్ల ఆకస్మిక పర్యటనలు జరిపారు. షేక్ మొహమ్మద్ వెంట ఆయన కుమారుడు, దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ షేక్ హమదాన్ బిన్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్ కూడా ఉన్నారు. దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ టెర్మినల్ 3 వద్ద రాయల్ ఫ్యామిలీ కనిపించడంతో అక్కడివారంతా ఆశ్చర్యానుభూతులకు లోనయ్యారు. దుబాయ్ మీడియా ఆఫీస్, ఈ మేరకు ఓ ఫొటోని విడుదల చేసింది. ఇన్స్టాగ్రామ్లో వీడియోని పోస్ట్ చేయడం జరిగింది. దుబాయ్ మెట్రోలో కూడా షేక్ మొహమ్మద్ మరియు షేక్ హమదాన్ ప్రయాణించారు. కొన్నాళ్ళ క్రితమే మదినాత్ జుమైరాలోని దుబాయ్ రెస్టారెంట్లోనూ షేక్ మొహమ్మద్ డిన్నర్ చేయడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది.
తాజా వార్తలు
- భారత్-ఇజ్రాయెల్ మధ్య కీలక ఒప్పందాలు
- మళ్లీ తగ్గిన బంగారం ధర..పసిడి ప్రియులకు కాస్త ఊరట
- సౌదీ చమురుయేతర ఎగుమతుల్లో 18.6% వృద్ధి..!!
- సల్మాబాద్లోని గ్యారేజీని దోచుకున్న ఫేక్ పోలీసులు..!!
- బ్యాడ్మింటన్ గేమ్ ఆడుతూ..కేరళ వాసి మృతి..!!
- దక్షిణ అల్ బటినాలో ఫ్రాడ్ సస్పెక్ట్ అరెస్ట్..!!
- ఖతార్ లో 7 శాతం పెరిగిన FDI లు..!!
- యూఏఈ-ఇండియా మధ్య ఎయిర్ ఫెయిర్స్ కు రెక్కలు..!!
- ఆన్లైన్ కంటెంట్కు డిజిటల్ ప్లాట్ఫామ్లు బాధ్యత వహించాలి: మంత్రి వైష్ణవ్
- గన్నవరంలో ఈ నెల 28న జాబ్ మేళా









