'జై' రికార్డులు బద్దలు కొడుతోంది
- July 07, 2017
ఎన్టీఆర్ , నివేద థామస్ , రాశి ఖన్నా జంటగా బాబీ దర్శకత్వం లో తెరకెక్కుతున్న మూవీ 'జై లవకుశ'. ఈ మూవీ ఫస్ట్ లుక్ టీజర్ నిన్న సాయంత్రం రిలీజ్ అయి సరికొత్త రికార్డ్స్ సృష్టిస్తుంది. టీజర్ లో జై రోల్ కు అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులు జై జైలు కొడుతున్నారు. ఎక్కడ చూసిన ఈ టీజర్ గురించి , ఎన్టీఆర్ నటన గురించి గొప్పగా చెపుతున్నారు.
అంతే కాదు టీజర్ విడుదలైన తొలి 100 నిమిషాల్లోనే లక్ష లైక్లు వచ్చాయంటే టీజర్ ఎలా ఉందొ అర్ధం చేసుకోవచ్చు. యూట్యూబ్లో 4 లక్షలకు పైగా వ్యూస్, ఐదు లక్షల డిజిటల్ వ్యూస్తో రికార్డ్ సృష్టించినట్లు చిత్రబృందం సోషల్మీడియా ద్వారా వెల్లడించింది. ఈ టీజర్ టాలీవుడ్లో రికార్డ్ సృష్టించింది అంటూ పోస్టర్ షేర్ చేసారు.
ఈ చిత్రంలో ఎన్టీఆర్ 'జై', 'లవ', 'కుశ' అనే మూడు పాత్రల్లో నటిస్తున్నాడు. నిన్న జై కు సంబదించిన టీజర్ రిలీజ్ చేసారు. అలాగే మిగతా రెండు రోల్స్ కు సంబదించిన టీజర్లు కూడా రిలీజ్ చేస్తారట. దసరా పండుగను పురస్కరించుకుని చిత్రాన్ని సెప్టెంబర్21న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని నిర్ణయించారు.
తాజా వార్తలు
- క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్..2027 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల
- సాహ్ల్ ద్వారా డొమెస్టిక్ వర్కర్లు, డ్రైవర్ల స్పాన్సర్షిప్ బదిలీ..!!
- షార్జాలో హత్యకు గురైన భారతీయుడి మృతదేహం స్వదేశానికి తరలింపు..!!
- ఏప్రిల్లో 16% పెరిగి SR14.7 బిలియన్లకు చేరిన రెమిటెన్స్..!!
- ఆన్లైన్లో ఉగ్రవాద సంబంధిత దుస్తులు సేల్..ముగ్గురు అరెస్టు..!!
- ఒమన్ సాంస్కృతిక వారసత్వ హోదా పటిష్టం..!!
- డ్రైవర్కు 3 నెలల జైలు శిక్ష విధించిన దుబాయ్ కోర్టు..!!
- ఖతార్ లో అత్యధిక ఉష్ణోగ్రతలు, దుమ్ము తుఫాన్ల అలెర్ట్..!!
- హైదరాబాద్ కు రూ.లక్ష కోట్లు కేటాయించండి..ప్రధాని మోదీని కోరిన సీఎం రేవంత్
- అమెరికా దాడిలో వైజాగ్ వాసి మృతి









