'జై' రికార్డులు బద్దలు కొడుతోంది
- July 07, 2017
ఎన్టీఆర్ , నివేద థామస్ , రాశి ఖన్నా జంటగా బాబీ దర్శకత్వం లో తెరకెక్కుతున్న మూవీ 'జై లవకుశ'. ఈ మూవీ ఫస్ట్ లుక్ టీజర్ నిన్న సాయంత్రం రిలీజ్ అయి సరికొత్త రికార్డ్స్ సృష్టిస్తుంది. టీజర్ లో జై రోల్ కు అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులు జై జైలు కొడుతున్నారు. ఎక్కడ చూసిన ఈ టీజర్ గురించి , ఎన్టీఆర్ నటన గురించి గొప్పగా చెపుతున్నారు.
అంతే కాదు టీజర్ విడుదలైన తొలి 100 నిమిషాల్లోనే లక్ష లైక్లు వచ్చాయంటే టీజర్ ఎలా ఉందొ అర్ధం చేసుకోవచ్చు. యూట్యూబ్లో 4 లక్షలకు పైగా వ్యూస్, ఐదు లక్షల డిజిటల్ వ్యూస్తో రికార్డ్ సృష్టించినట్లు చిత్రబృందం సోషల్మీడియా ద్వారా వెల్లడించింది. ఈ టీజర్ టాలీవుడ్లో రికార్డ్ సృష్టించింది అంటూ పోస్టర్ షేర్ చేసారు.
ఈ చిత్రంలో ఎన్టీఆర్ 'జై', 'లవ', 'కుశ' అనే మూడు పాత్రల్లో నటిస్తున్నాడు. నిన్న జై కు సంబదించిన టీజర్ రిలీజ్ చేసారు. అలాగే మిగతా రెండు రోల్స్ కు సంబదించిన టీజర్లు కూడా రిలీజ్ చేస్తారట. దసరా పండుగను పురస్కరించుకుని చిత్రాన్ని సెప్టెంబర్21న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని నిర్ణయించారు.
తాజా వార్తలు
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్కాందే బాధ్యత
- కువైట్లో స్మార్ట్ ట్రాఫిక్ సిగ్నళ్లు..!!
- మెసైమీర్ ఇంటర్చేంజ్ టన్నెల్ తాత్కాలికంగా మూసివేత..!!
- ఒమన్లో కఠిన చట్టం.. OMR100,000 వరకు జరిమానా..!!
- 50 డిగ్రీల వేడిలోనూ యూఏఈలో వర్షాలు..!!
- ఆన్లైన్ యాప్లతో హ్యూమన్ ట్రాఫికింగ్ ముప్పు పెరుగుతోంది..!!
- సౌదీ నేతృత్వంలో సముద్ర రక్షణ కూటమి ఏర్పాటు..!!
- బహ్రెయిన్ షీల్డ్ సంయుక్త సైనిక విన్యాసాలకు షేక్ హమ్దాన్ హాజరు..







