ప్రపంచ రెజ్లింగ్‌ ఛాంపియన్‌ షిప్‌కు సాక్షి మాలిక్‌ మరియు వినీశ్‌ ఫొగట్‌

- July 08, 2017 , by Maagulf
ప్రపంచ రెజ్లింగ్‌ ఛాంపియన్‌ షిప్‌కు సాక్షి మాలిక్‌ మరియు వినీశ్‌ ఫొగట్‌

అగ్రశ్రేణి మహిళా రెజ్లర్లు రియో ఒలింపిక్‌ కాంస్య పతక విజేత సాక్షి మాలిక్‌, ఆసియా ఛాంపియన్‌షిప్‌ విజేత వినీశ్‌ ఫొగట్‌ ప్రపంచ రెజ్లింగ్‌ ఛాంపియన్‌ షిప్‌కు ఎంపికయ్యారు. ఫ్రాన్స్‌ రాజధాని పారిస్‌లో వచ్చే నెలలో ఈ పోటీలు జరగను న్నాయి. భారత రెజ్లింగ్‌ సమాఖ్య లఖ్‌నవూలో ఆయా విభాగాల్లో ట్రయల్స్‌ నిర్వహించి భారత తరుపున పోటీదారులను ఎంపిక చేశారు. రియో ఒలింపిక్స్‌ కాంస్య పతక విజేత (58కెజీలు), ఆసియా ఛాంపియన్‌ షిప్‌ (60కెజీలు) రజత పతక విజేత సాక్షి మాలిక్‌ ఈపోటీలకు ఎంపికైంది. ఆసియా ఛాంపియన్స్‌షిప్‌లో రజతం కైవసం చేసుకున్న వినీశ్‌ ఫొగట్‌ (48కేజీల) విభాగంలో బరిలోకి దిగనుంది. శ్రీతల్‌ 53కిలోల విభాగంలో, పూజా దండ 58కెజీల, శిల్పి 63కిలోల, నవజోత్‌ కౌర్‌ 69కిలోల, పూజ 75కేజీల విభాగాల్లో ప్రపంచ ఛాంపి యన్‌ షిప్‌కు ఎంపికయ్యారు. గీతాఫొగట్‌, బబితా ఫొగట్‌ ట్రయల్స్‌లో పాల్గొనలేదు. రితు, సంతీత ఫొగట్‌ అర్హత సాధించలేక పోయారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com