శరవేగంగా దోహా మెట్రో నిర్మాణం
- July 09, 2017
దోహా మెట్రో మొదటి ఫేజ్ శరవేగంగా నిర్మితమవుతోందనీ, ఇప్పటికే 60 శాతం పైగా పనులు పూర్తయ్యాయని, షెడ్యూల్ ప్రకారమే ఈ ప్రాజెక్ట్ పూర్తవుతుందని మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అబ్దుల్లా అబ్దుల్ అజీజ్ అల్ సుబైసీద్ చెప్పారు. 280 మిలియన్ మేన్ అవర్స్ వర్క్ ఇప్పటికే పూర్తయ్యిందన్న అబ్దుల్లా అజీజ్, 10 మెట్రో ప్యాకేజీలు తదుపరి ఫేజ్ డెవలప్మెంట్కి అడ్వాన్స్ అవుతున్నాయని, 37 స్టేషన్లలో మెకానికల్, ఎలక్ట్రికల్ మరియు ఆర్కిటెక్చర్ ఫిట్ ఔట్ జరుగుతోందని తెలిపారు. ఖతార్ రైల్ మరియు మినిస్ట్రీ ఆఫ్ ట్రాన్స్ పోర్ట్ అండ్ కమ్యూనికేషన్ ఈ ప్రాజెక్టుని అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించాయి. సకాలంలో ప్రాజెక్టులు పూర్తయ్యేందుకు వీలుగా తీసుకోవాల్సిన చర్యలపై డెలివరీ ఎలైన్మెంట్ వర్క్షాప్ని ఖతార్ రైల్వేస్ కంపెనీ నిర్వహించింది. ఈ సందర్భంగా మాట్లాడిన అబ్దుల్లా అల్ సుబైయీ, పనుల వేగం పట్ల సంతృప్తితో ఉన్నామన్నారు. 52,000 మందికి మెట్రో తొలి ఫేజ్ కోసం పనిచేస్తున్నారు.
తాజా వార్తలు
- విమానాశ్రయాలకు ఫేక్ బాంబ్ కాల్స్ పై కేంద్రం సంచలన నిర్ణయం!
- దుబాయ్ విమానాశ్రయంలో కలకలం..వదిలేసిన సూట్కేసులో 223 అడవి జంతువులు స్వాధీనం
- అబుధాబికి వచ్చే ఎతిహాద్ ప్రయాణికులకు ఉచిత వైద్య ప్రయాణ బీమా
- QR6.2 బిలియన్ల విలువైన రెసిడెన్షియల్ యూనిట్లు సేల్..!!
- ఆన్లైన్ లో దుష్ప్రవర్తన.. ఇద్దరు మహిళలు అరెస్టు..!!
- కువైట్ లో ఇండియన్ మ్యాంగో ఫెస్టివల్ 2026..!!
- ఒమన్లో తొలి ప్రైవేట్ వాహన తనిఖీ కేంద్రం ప్రారంభం..!!
- ప్రీమియం రెసిడెన్సీ హోల్డర్లు SR100 వర్క్ పర్మిట్ పొందాలి..!!
- ICP అధికారుల పేరిట గూగుల్ మీట్ స్కామ్.. హెచ్చరికలు జారీ..!!
- AI డీప్ఫేక్ మోసాల పట్ల కేంద్రం కీలక హెచ్చరిక









