ఎయిర్ ఇండియా లో మాంసాహారం బంద్ పై దుమారం
- July 10, 2017
ఉరుము ఉరిమి మంగలం మీద పడిందంటే ఇదేమరి. ఎయిరిండియా మహారాజావారికి మహా కోపం వచ్చేసింది. ఎన్ని సర్వీసులు నడిపినా, ఎన్ని పొదుపు చర్యలు పాటించినా, ఖర్చులను ఎంత కంట్రోల్ చేసినా సంస్థ అప్పులు కొండవీటి చాంతాడులా పెరిగిపోతున్నాయే బతికి బట్టకట్టాలంటే ఏం చేయాలి అని మథనపడి మథనపడి చివరకు ఒక కఠోర నిర్ణయం తీసుకున్నారు. తక్కువ ధరల టిక్కెట్లతో ప్రయాణించే ప్యాసింజర్లకు మాంసాహారం కట్ చేశారు. అంతపెద్ద మహాజారావారికి తక్కువ క్లాసు వారిమీదే చూపు పడింది. గంగమ్మకు పోతరాజులాగా అన్నమాట. ఇంకేం ఇక నుంచి మీరు మా విమానాల్లో ప్రయాణించేటప్పుడు మీకు మాంసం వడ్డంచం పోండని చెప్పి చేతులు దులుపుకుంది. అది కూడా దేశీయ విమానాల్లోనే అట. ఎయిరిండియా తన అప్పుల భారం తగ్గించుకునేందుకు ఎన్నుకున్న పరిష్కారం ఇదన్నమాట.
దేశీయ విమానాల్లోని ఎకానమీ క్లాస్ ప్రయాణికులకు మాంసాహారం వడ్డించబోమని ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా పేర్కొంది. ఇకపై కేవలం శాకాహారం మాత్రమే అందిస్తామని తెలిపింది. అంతర్జాతీయ విమానాల్లో మాత్రం ఎలాంటి మార్పు ఉండబోదని స్పష్టం చేసింది. 'గత రెండు వారాల నుంచే దేశీయ విమానాల్లోని ఎకానమీ క్లాస్ ప్రయాణికులకు మాంసాహారం వడ్డించడం లేదు' అని సంబంధిత అధికారి చెప్పారు.
కాగా ఎయిరిండియాకు రూ. 52వేల కోట్ల వరకు అప్పులున్నాయి. దీంతో సంస్థను ప్రైవేటీకరించేందుకు కేంద్ర కేబినెట్ సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది. అయితే ప్రైవేటీకరణ బారినుంచి ఎయిరిండియాను కాపాడుకునేందుకు ఉద్యోగులు ఖర్చు తగ్గింపు ప్రణాళికలను యాజమాన్యం దృష్టికి తీసుకొచ్చినట్లు అధికారులు చెబుతున్నారు.
తాజా వార్తలు
- కొత్త వాటర్ఫ్రంట్ గమ్యస్థానం నామీ బీచ్..!!
- దుబాయ్ లో స్టంట్స్ చేసిన మోటార్ సైకిల్ సీజ్..!!
- 18.5 గంటల సంక్లిష్ట ఆపరేషన్.. ఫలించిన సౌదీ సర్జన్ల కృషి..!!
- అన్ని తరాలకూ వ్యాక్సిన్లు పనిచేస్తాయి..!!
- ఎయిర్ స్పెస్ ను తిరిగి తెరిచిన కువైట్..!!
- కజకిస్తాన్ ప్రధానమంత్రితో సయ్యద్ థెయాజిన్ భేటీ..!!
- తెలంగాణ: ఆర్టీసీ సమ్మెలో కీలక మలుపు..
- సచిన్ టెండూల్కర్ 53వ పుట్టినరోజు: ఫ్యాన్స్తో కలిసి వేడుకలు..
- మైక్రోసాఫ్ట్ ‘బైఅవుట్’ ఆఫర్
- ఏప్రిల్ 26 నుండి జజీరా ఎయిర్వేస్ నేరుగా విమాన సర్వీసులు ప్రారంభం









