50 మంది అమర్నాధ్ యాత్రికులను కాపాడిన సలీమ్
- July 11, 2017
పవిత్ర అమర్నాథ్ యాత్ర చేస్తున్న యాత్రికులను కూడా ఉగ్రవాదులు విడిచిపెట్టట్లేదు. వారిని కూడా లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరిపి తమ క్రూరత్వాన్ని చాటుకుంటున్నారు. అమర్నాథ్ గుహలోని మంచు శివలింగాన్ని దర్శించుకుని తిరిగి వైష్ణోదేవి ఆలయానికి వెళ్తుండగా బస్సుపై ఒక్కసారిగా బుల్లెట్ల వర్షం కురిసింది. అనుకోని ఈ సంఘటనకు షాక్ తిన్న డ్రైవర్ వెంటనే తేరుకుని కిలోమీటర్ దూరం వరకు పోనిచ్చాడు. దీంతో 50 మంది ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ఘటనలో 7గురు మృతి చెందగా, 11 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను అనంతనాగ్ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో చికిత్స పొందుతున్న భాగ్యమణి ఆ భయానక సంఘటన జరిగిన తీరును వివరించారు. ఈ ఘటనలో తన బంధువు నిర్మల ప్రాణాలు కోల్పోయారు. ఉగ్రవాదులు బస్సుపై కాల్పులు జరుపుతున్నావెరవకుండా కిలో మీటరు వరకు అలానే ప్రయాణించి 50 మంది ప్రాణాలను కాపాడిన డ్రైవర్ సలీమ్కు కృతజ్ఞతలు తెలియజేశారు.
తాజా వార్తలు
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్కాందే బాధ్యత
- కువైట్లో స్మార్ట్ ట్రాఫిక్ సిగ్నళ్లు..!!
- మెసైమీర్ ఇంటర్చేంజ్ టన్నెల్ తాత్కాలికంగా మూసివేత..!!
- ఒమన్లో కఠిన చట్టం.. OMR100,000 వరకు జరిమానా..!!
- 50 డిగ్రీల వేడిలోనూ యూఏఈలో వర్షాలు..!!
- ఆన్లైన్ యాప్లతో హ్యూమన్ ట్రాఫికింగ్ ముప్పు పెరుగుతోంది..!!
- సౌదీ నేతృత్వంలో సముద్ర రక్షణ కూటమి ఏర్పాటు..!!
- బహ్రెయిన్ షీల్డ్ సంయుక్త సైనిక విన్యాసాలకు షేక్ హమ్దాన్ హాజరు..







