ప్రముఖ కార్టూనిస్ట్, రచయిత మంగేశ్ తెందుల్కర్ కన్నుమూత
- July 11, 2017
ప్రముఖ కార్టూనిస్ట్, రచయిత మంగేశ్ తెందుల్కర్(82) కన్నుమూశారు. మంగేశ్ గత ఆదివారం అనారోగ్యానికి గురి కావడంతో పుణెలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చారు. చికిత్స పొందుతూ సోమవారం రాత్రి తుదిశ్వాస విడిచినట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు.
82ఏళ్ల మంగేశ్ తన చివరి రోజుల వరకు కార్టూన్లు వేస్తూనే గడిపారు.ఆయన కార్టూన్లలోని కొన్నింటిని గత నెల్లో పుణెలో ప్రదర్శనకు ఉంచారు. మంగేశ్ సామాజిక కార్యకర్త కూడా. తన కార్టూన్లు, కారికేచర్లతో ప్రజల్లో ట్రాఫిక్ సమస్యలపై అవగాహన తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ట్రాఫిక్ నిబంధనలను పోస్టుకార్డులపై సందేశంగా రాసి.. వాటిని తానే స్వయంగా సిగ్నల్స్ వద్ద నిలబడి వాహనదారులకు పంచేవారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. కార్టూన్లే కాకుండా మంగేశ్ రాసిన అనేక వ్యాసాలు వార్తాపత్రికల్లో ప్రచురితమయ్యాయి.
తాజా వార్తలు
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్కాందే బాధ్యత
- కువైట్లో స్మార్ట్ ట్రాఫిక్ సిగ్నళ్లు..!!
- మెసైమీర్ ఇంటర్చేంజ్ టన్నెల్ తాత్కాలికంగా మూసివేత..!!
- ఒమన్లో కఠిన చట్టం.. OMR100,000 వరకు జరిమానా..!!
- 50 డిగ్రీల వేడిలోనూ యూఏఈలో వర్షాలు..!!
- ఆన్లైన్ యాప్లతో హ్యూమన్ ట్రాఫికింగ్ ముప్పు పెరుగుతోంది..!!
- సౌదీ నేతృత్వంలో సముద్ర రక్షణ కూటమి ఏర్పాటు..!!
- బహ్రెయిన్ షీల్డ్ సంయుక్త సైనిక విన్యాసాలకు షేక్ హమ్దాన్ హాజరు..







