ప్రముఖ కార్టూనిస్ట్, రచయిత మంగేశ్ తెందుల్కర్ కన్నుమూత
- July 11, 2017
ప్రముఖ కార్టూనిస్ట్, రచయిత మంగేశ్ తెందుల్కర్(82) కన్నుమూశారు. మంగేశ్ గత ఆదివారం అనారోగ్యానికి గురి కావడంతో పుణెలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చారు. చికిత్స పొందుతూ సోమవారం రాత్రి తుదిశ్వాస విడిచినట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు.
82ఏళ్ల మంగేశ్ తన చివరి రోజుల వరకు కార్టూన్లు వేస్తూనే గడిపారు.ఆయన కార్టూన్లలోని కొన్నింటిని గత నెల్లో పుణెలో ప్రదర్శనకు ఉంచారు. మంగేశ్ సామాజిక కార్యకర్త కూడా. తన కార్టూన్లు, కారికేచర్లతో ప్రజల్లో ట్రాఫిక్ సమస్యలపై అవగాహన తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ట్రాఫిక్ నిబంధనలను పోస్టుకార్డులపై సందేశంగా రాసి.. వాటిని తానే స్వయంగా సిగ్నల్స్ వద్ద నిలబడి వాహనదారులకు పంచేవారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. కార్టూన్లే కాకుండా మంగేశ్ రాసిన అనేక వ్యాసాలు వార్తాపత్రికల్లో ప్రచురితమయ్యాయి.
తాజా వార్తలు
- తెలంగాణ ప్రభుత్వం, ఆర్టీసీ జేఏసీ నేతల మధ్య చర్చలు సఫలం..!
- IPL 2026: గుజరాత్ పై బెంగళూరు ఘన విజయం
- వేసవి సెలవుల్లో విద్యార్థులకు సాఫ్ట్వేర్ కోర్సుల శిక్షణ రోహేలాస్ టెక్ ఆహ్వానం
- మణిపూర్లో ఘర్షణలు..ముగ్గురు మృతి
- పేటీఎంకు ఆర్బీఐ బిగ్ షాక్..
- హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో వర్షం
- కొత్త వాటర్ఫ్రంట్ గమ్యస్థానం నామీ బీచ్..!!
- దుబాయ్ లో స్టంట్స్ చేసిన మోటార్ సైకిల్ సీజ్..!!
- 18.5 గంటల సంక్లిష్ట ఆపరేషన్.. ఫలించిన సౌదీ సర్జన్ల కృషి..!!
- అన్ని తరాలకూ వ్యాక్సిన్లు పనిచేస్తాయి..!!









