ప్రముఖ కార్టూనిస్ట్, రచయిత మంగేశ్ తెందుల్కర్ కన్నుమూత
- July 11, 2017
ప్రముఖ కార్టూనిస్ట్, రచయిత మంగేశ్ తెందుల్కర్(82) కన్నుమూశారు. మంగేశ్ గత ఆదివారం అనారోగ్యానికి గురి కావడంతో పుణెలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చారు. చికిత్స పొందుతూ సోమవారం రాత్రి తుదిశ్వాస విడిచినట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు.
82ఏళ్ల మంగేశ్ తన చివరి రోజుల వరకు కార్టూన్లు వేస్తూనే గడిపారు.ఆయన కార్టూన్లలోని కొన్నింటిని గత నెల్లో పుణెలో ప్రదర్శనకు ఉంచారు. మంగేశ్ సామాజిక కార్యకర్త కూడా. తన కార్టూన్లు, కారికేచర్లతో ప్రజల్లో ట్రాఫిక్ సమస్యలపై అవగాహన తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ట్రాఫిక్ నిబంధనలను పోస్టుకార్డులపై సందేశంగా రాసి.. వాటిని తానే స్వయంగా సిగ్నల్స్ వద్ద నిలబడి వాహనదారులకు పంచేవారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. కార్టూన్లే కాకుండా మంగేశ్ రాసిన అనేక వ్యాసాలు వార్తాపత్రికల్లో ప్రచురితమయ్యాయి.
తాజా వార్తలు
- AI డీప్ఫేక్ మోసాల పట్ల కేంద్రం కీలక హెచ్చరిక
- సూడాన్లో డ్రోన్ దాడిలో 15 మంది మృత్యువాత..
- అమరావతికి భారీ నిధులు..రూ.2,534 కోట్లతో కొత్త ప్రాజెక్టులు షురూ!
- అమెరికా వీసా కోసం నెలల వెయిటింగ్? ఇకపై ఫాస్ట్ ట్రాక్ మార్గం ఇదే!
- ప్రపంచంలోనే తొలి ట్రిలియనీర్గా ఎలాన్ మస్క్
- క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్..2027 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల
- సాహ్ల్ ద్వారా డొమెస్టిక్ వర్కర్లు, డ్రైవర్ల స్పాన్సర్షిప్ బదిలీ..!!
- షార్జాలో హత్యకు గురైన భారతీయుడి మృతదేహం స్వదేశానికి తరలింపు..!!
- ఏప్రిల్లో 16% పెరిగి SR14.7 బిలియన్లకు చేరిన రెమిటెన్స్..!!
- ఆన్లైన్లో ఉగ్రవాద సంబంధిత దుస్తులు సేల్..ముగ్గురు అరెస్టు..!!









