మేథీ న గోట
- July 11, 2017
కావలసినవి: శెనగపిండి - ఒక కప్పు, మెంతి ఆకుల తరుగు - అర కప్పు, నల్లమిరియాలు - పది, ధనియాలు - ఒక టీస్పూన్, వాము - అర టీ స్పూన్, పచ్చి మిర్చి - నాలుగు (సన్నగా తరిగి), నూనె - ఒక టేబుల్ స్పూన్(వేగించడానికి సరిపడా కూడా నూనె తీసుకోవాలి), పంచదార - ఒక టీస్పూన్, ఇంగువ- పావు టీస్పూన్, బేకింగ్ సోడా - చిటికెడు, ఉప్పు - రుచికి తగినంత, నీళ్లు - సరిపడా.
తయారుచేయు విధానం : ఒక గిన్నెలో నీళ్లు, టేబుల్ స్పూన్ నూనె వేసి కలపాలి. తరువాత అందులో వాము, పచ్చి మిర్చి, బేకింగ్ సోడా, ఉప్పు, పంచదార, ఇంగువ వేయాలి. మిరియాలు, ధనియాలు కచ్చాపచ్చాగా చేసి వేయాలి. తరువాత మెంతి ఆకులు, శెనగపిండి వేసి మిశ్రమాన్ని బాగా కలపాలి. ఒక పాన్లో నూనె వేడి చేయాలి. కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని చిన్న ఉండలు చేసి నూనెలో వేగించాలి. గ్రీన్చట్నీ లేకపోయినా వీటిని పచ్చి ఉల్లిపాయముక్కలు, వేగించిన పచ్చిమిర్చిలతో కలిపి తింటే రుచికరంగా ఉంటాయి.
తాజా వార్తలు
- దుబాయ్ విమానాశ్రయంలో కలకలం..వదిలేసిన సూట్కేసులో 223 అడవి జంతువులు స్వాధీనం
- అబుధాబికి వచ్చే ఎతిహాద్ ప్రయాణికులకు ఉచిత వైద్య ప్రయాణ బీమా
- QR6.2 బిలియన్ల విలువైన రెసిడెన్షియల్ యూనిట్లు సేల్..!!
- ఆన్లైన్ లో దుష్ప్రవర్తన.. ఇద్దరు మహిళలు అరెస్టు..!!
- కువైట్ లో ఇండియన్ మ్యాంగో ఫెస్టివల్ 2026..!!
- ఒమన్లో తొలి ప్రైవేట్ వాహన తనిఖీ కేంద్రం ప్రారంభం..!!
- ప్రీమియం రెసిడెన్సీ హోల్డర్లు SR100 వర్క్ పర్మిట్ పొందాలి..!!
- ICP అధికారుల పేరిట గూగుల్ మీట్ స్కామ్.. హెచ్చరికలు జారీ..!!
- AI డీప్ఫేక్ మోసాల పట్ల కేంద్రం కీలక హెచ్చరిక
- సూడాన్లో డ్రోన్ దాడిలో 15 మంది మృత్యువాత..









