మేథీ న గోట
- July 11, 2017
కావలసినవి: శెనగపిండి - ఒక కప్పు, మెంతి ఆకుల తరుగు - అర కప్పు, నల్లమిరియాలు - పది, ధనియాలు - ఒక టీస్పూన్, వాము - అర టీ స్పూన్, పచ్చి మిర్చి - నాలుగు (సన్నగా తరిగి), నూనె - ఒక టేబుల్ స్పూన్(వేగించడానికి సరిపడా కూడా నూనె తీసుకోవాలి), పంచదార - ఒక టీస్పూన్, ఇంగువ- పావు టీస్పూన్, బేకింగ్ సోడా - చిటికెడు, ఉప్పు - రుచికి తగినంత, నీళ్లు - సరిపడా.
తయారుచేయు విధానం : ఒక గిన్నెలో నీళ్లు, టేబుల్ స్పూన్ నూనె వేసి కలపాలి. తరువాత అందులో వాము, పచ్చి మిర్చి, బేకింగ్ సోడా, ఉప్పు, పంచదార, ఇంగువ వేయాలి. మిరియాలు, ధనియాలు కచ్చాపచ్చాగా చేసి వేయాలి. తరువాత మెంతి ఆకులు, శెనగపిండి వేసి మిశ్రమాన్ని బాగా కలపాలి. ఒక పాన్లో నూనె వేడి చేయాలి. కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని చిన్న ఉండలు చేసి నూనెలో వేగించాలి. గ్రీన్చట్నీ లేకపోయినా వీటిని పచ్చి ఉల్లిపాయముక్కలు, వేగించిన పచ్చిమిర్చిలతో కలిపి తింటే రుచికరంగా ఉంటాయి.
తాజా వార్తలు
- యూఏఈ: ప్రయాణికులకు ఓవర్స్టే జరిమానాల మాఫీ
- యూఏఈలో విద్యాసంస్థలకు మార్చి 9 నుంచి స్ప్రింగ్ బ్రేక్ సెలవులు
- నెల్లూరు నుంచి విదేశాలకు.. తీగలాగితే డొంక కదులుతోంది..!
- AIతో రూపొందించిన యుద్ధ వీడియోలపై ఎక్స్ కఠిన చర్యలు
- ఇరాన్ నౌక పై సబ్మెరైన్ దాడి
- యుద్ధంలోకి మమ్మల్ని లాగకండి: స్పెయిన్ ప్రధాని
- జెబల్ అలీ పోర్ట్లో యథావిధిగా కార్యకలాపాలు: భద్రతను కట్టుదిట్టం చేసిన అధికారులు!
- సౌదీలో 4రోజలపాటు ఈద్ అల్ ఫితర్ సెలవులు..!!
- వదంతులు, తప్పుడు వార్తల ప్రచారం పై దుబాయ్ పోలీస్ హెచ్చరిక ...
- చరిత్ర సృష్టించిన టీ20 ప్రపంచకప్









