మేథీ న గోట
- July 11, 2017కావలసినవి: శెనగపిండి - ఒక కప్పు, మెంతి ఆకుల తరుగు - అర కప్పు, నల్లమిరియాలు - పది, ధనియాలు - ఒక టీస్పూన్, వాము - అర టీ స్పూన్, పచ్చి మిర్చి - నాలుగు (సన్నగా తరిగి), నూనె - ఒక టేబుల్ స్పూన్(వేగించడానికి సరిపడా కూడా నూనె తీసుకోవాలి), పంచదార - ఒక టీస్పూన్, ఇంగువ- పావు టీస్పూన్, బేకింగ్ సోడా - చిటికెడు, ఉప్పు - రుచికి తగినంత, నీళ్లు - సరిపడా.
తయారుచేయు విధానం : ఒక గిన్నెలో నీళ్లు, టేబుల్ స్పూన్ నూనె వేసి కలపాలి. తరువాత అందులో వాము, పచ్చి మిర్చి, బేకింగ్ సోడా, ఉప్పు, పంచదార, ఇంగువ వేయాలి. మిరియాలు, ధనియాలు కచ్చాపచ్చాగా చేసి వేయాలి. తరువాత మెంతి ఆకులు, శెనగపిండి వేసి మిశ్రమాన్ని బాగా కలపాలి. ఒక పాన్లో నూనె వేడి చేయాలి. కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని చిన్న ఉండలు చేసి నూనెలో వేగించాలి. గ్రీన్చట్నీ లేకపోయినా వీటిని పచ్చి ఉల్లిపాయముక్కలు, వేగించిన పచ్చిమిర్చిలతో కలిపి తింటే రుచికరంగా ఉంటాయి.
తాజా వార్తలు
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..