మేథీ న గోట
- July 11, 2017
కావలసినవి: శెనగపిండి - ఒక కప్పు, మెంతి ఆకుల తరుగు - అర కప్పు, నల్లమిరియాలు - పది, ధనియాలు - ఒక టీస్పూన్, వాము - అర టీ స్పూన్, పచ్చి మిర్చి - నాలుగు (సన్నగా తరిగి), నూనె - ఒక టేబుల్ స్పూన్(వేగించడానికి సరిపడా కూడా నూనె తీసుకోవాలి), పంచదార - ఒక టీస్పూన్, ఇంగువ- పావు టీస్పూన్, బేకింగ్ సోడా - చిటికెడు, ఉప్పు - రుచికి తగినంత, నీళ్లు - సరిపడా.
తయారుచేయు విధానం : ఒక గిన్నెలో నీళ్లు, టేబుల్ స్పూన్ నూనె వేసి కలపాలి. తరువాత అందులో వాము, పచ్చి మిర్చి, బేకింగ్ సోడా, ఉప్పు, పంచదార, ఇంగువ వేయాలి. మిరియాలు, ధనియాలు కచ్చాపచ్చాగా చేసి వేయాలి. తరువాత మెంతి ఆకులు, శెనగపిండి వేసి మిశ్రమాన్ని బాగా కలపాలి. ఒక పాన్లో నూనె వేడి చేయాలి. కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని చిన్న ఉండలు చేసి నూనెలో వేగించాలి. గ్రీన్చట్నీ లేకపోయినా వీటిని పచ్చి ఉల్లిపాయముక్కలు, వేగించిన పచ్చిమిర్చిలతో కలిపి తింటే రుచికరంగా ఉంటాయి.
తాజా వార్తలు
- ఒమన్ మానవ హక్కుల కమిషన్ (OHRC) పునర్నిర్మాణం..!!
- జాతీయ భద్రతా ఉల్లంఘనలపై తక్షణ చర్యలకు ఆదేశాలు..!!
- ఎయిర్ పోర్ట్ సంసిద్ధతను పరిశీలించిన కువైట్ పీఎం..!!
- IPL 2026: లక్నో పై పంజాబ్ ఘన విజయం
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం
- దుబాయ్, మనామా, ఖసాబ్కు విమానాలు తిరిగి ప్రారంభించిన ఒమాన్ ఎయిర్వేస్
- సీఎం చంద్రబాబు బర్త్డే సీడీపీ వచ్చేసింది!
- బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు..19 మంది మృతి
- 'వారాహి హోమియోపతి’ చికిత్స కేంద్రం ప్రారంభం
- దేశంలోనే తొలి LED క్రెడిట్ కార్డు లాంచ్..ఫీచర్లు ఇవే!









