భారతీయ కాన్సుల్ జనరల్ను కలిసిన తెలుగు ప్రవాసీ
- July 11, 2017
దుబాయ్: దుబాయ్ లో నూతన భారతీయ కాన్సుల్ జనరల్గా నియమితులైన విపుల్ను వివిధ ప్రవాసీ సంఘాల వారు మర్యాదపూర్వకంగా కలుసుకుంటున్నారు. ఈ సందర్భంగా తమ తమ సమస్యలను ప్రవాసులు ఆయనకు వివరిస్తున్నారు. ఇందులో భాగంగా ఇటీవల ఇండియన్ పీపుల్స్ ఫోరం అనే ప్రవాస భారతీయుల స్వచ్చంధ సంస్ధ ప్రతినిధులు కాన్సుల్ జనరల్ను కలిశారు.
దుబాయ్, షార్జా నగరాల్లో తెలంగాణ ప్రవాసులు ఎదుర్కోంటున్న సమస్యలను వివరిస్తూ వాటి పరిష్కారానికి కృషి చేయవల్సిందిగా విపుల్ను కోరినట్లు సామాజిక కార్యకర్త జనగామ శ్రీనివాస్ తెలిపారు. రాజన్న సిరిసిల్లా జిల్లాకు చెందిన శ్రీనివాస్ షార్జాలో పని చేస్తూ కష్టాల్లో ఉన్న ప్రవాసులకు చేతనైన సాయం చేస్తూ, ప్రమాదవశాత్తూ ఎవరైనా మరణిస్తే.. వారి మృతదేహాలను స్వస్థలాలకు పంపేందుకు విశేష కృషి చేస్తుంటారు. కాన్సుల్ జనరల్ను కలిసిన వారిలో వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రతినిధులు ఉండగా అందులో తెలంగాణ నుండి శ్రీనివాస్, పందిళ్ళ మహెందర్ ఉన్నారు.
తాజా వార్తలు
- విమానాశ్రయాలకు ఫేక్ బాంబ్ కాల్స్ పై కేంద్రం సంచలన నిర్ణయం!
- దుబాయ్ విమానాశ్రయంలో కలకలం..వదిలేసిన సూట్కేసులో 223 అడవి జంతువులు స్వాధీనం
- అబుధాబికి వచ్చే ఎతిహాద్ ప్రయాణికులకు ఉచిత వైద్య ప్రయాణ బీమా
- QR6.2 బిలియన్ల విలువైన రెసిడెన్షియల్ యూనిట్లు సేల్..!!
- ఆన్లైన్ లో దుష్ప్రవర్తన.. ఇద్దరు మహిళలు అరెస్టు..!!
- కువైట్ లో ఇండియన్ మ్యాంగో ఫెస్టివల్ 2026..!!
- ఒమన్లో తొలి ప్రైవేట్ వాహన తనిఖీ కేంద్రం ప్రారంభం..!!
- ప్రీమియం రెసిడెన్సీ హోల్డర్లు SR100 వర్క్ పర్మిట్ పొందాలి..!!
- ICP అధికారుల పేరిట గూగుల్ మీట్ స్కామ్.. హెచ్చరికలు జారీ..!!
- AI డీప్ఫేక్ మోసాల పట్ల కేంద్రం కీలక హెచ్చరిక









