ఈ ఏడాది హజ్ యాత్ర కోసం 239,000 దేశీయ యాత్రికులు రావొచ్చని అంచనా
- July 11, 2017
ఈ సంవత్సరం 239,000 మంది దేశీయ యాత్రికులు హజ్ యాత్ర కోసం వచ్చేందుకు సిద్ధమవుతున్నారని హజ్ మరియు ఉమ్రహ్ మంత్రిత్వ శాఖ అంచనా వేసింది. ఇందుకోసం 3,477 సౌదీ రియాళ్ళ నుండి 14.000 సౌదీ రియాళ్ళ వరకు ఫీజు స్థాయి ఉంటుంది. దేశీయ యాత్రికుల కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియ మంత్రిత్వశాఖ నిర్వహించే ఇ-పోర్టల్ ద్వారా జరగుతుంది. దీని తర్వాత అనుమతి పొందేందుకు అవసరమైన రుసుము చెల్లించాల్సి ఉంటుంది. మంత్రిత్వశాఖ ఇప్పటికి 250 స్థానిక హజ్ కంపెనీలలో 114 కంపెనీలకు లైసెన్స్ ఇచ్చింది. మంత్రిత్వ శాఖ ప్రకారం హజ్ ముజసర్కు (సిఫారసు చేయబడిన తీర్థయాత్ర) స్థానాలకు సుమారుగా 23,477 సీట్లు ఉండగా, సులభమయిన తీర్థయాత్రను జరిపేందుకు లబ్ధిదారులకు మక్కాలో వసతి మరియు బస్సులలో పవిత్ర స్థలాలకు యాత్రికులను రవాణా చేస్తారు. పవిత్ర ప్రదేశాలకు భక్తుల సౌకర్యార్ధం మాషర్ రైలు ఉపయోగించనున్నారు.మంత్రిత్వ శాఖ కూడా వారి అతి ముఖ్యమైన వ్యక్తుల తీర్థయాత్ర కోసం అతిశయోక్తి ప్రకటనలు రూపొందించడం లేదా ప్రత్యేకంగా అతి ముఖ్యమైన యాత్రికులు కోసం సిద్ధం చేసిన గుడారాల ఫోటోలను చూపిస్తున్న స్థానిక హజ్ సంస్థల విపరీత పోకడలను నిషేధించారు. సౌదీ టీవీ మరియు అల్-ఏకఃబారియహ్ మినహా అన్ని టీవీ ఛానల్స్ చట్టపరమైన కాలానుగుణ లైసెన్స్ పొందటానికి ముందు స్థానిక హజ్ కంపెనీలకు తమ సేవలను ప్రకటించటానికి హక్కు లేదని మంత్రిత్వశాఖ తన పుస్తకంలో 'ది డైరెక్టరీ ఆఫ్ ది ఎగ్జిక్యూటివ్ ప్రొసీజర్స్' అనే పేరు పెట్టింది, దీనిని మంత్రి మొహమ్మద్ సలేహ్ బంటన్ ఆమోదించారు.
తాజా వార్తలు
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్కాందే బాధ్యత
- కువైట్లో స్మార్ట్ ట్రాఫిక్ సిగ్నళ్లు..!!
- మెసైమీర్ ఇంటర్చేంజ్ టన్నెల్ తాత్కాలికంగా మూసివేత..!!
- ఒమన్లో కఠిన చట్టం.. OMR100,000 వరకు జరిమానా..!!
- 50 డిగ్రీల వేడిలోనూ యూఏఈలో వర్షాలు..!!
- ఆన్లైన్ యాప్లతో హ్యూమన్ ట్రాఫికింగ్ ముప్పు పెరుగుతోంది..!!
- సౌదీ నేతృత్వంలో సముద్ర రక్షణ కూటమి ఏర్పాటు..!!
- బహ్రెయిన్ షీల్డ్ సంయుక్త సైనిక విన్యాసాలకు షేక్ హమ్దాన్ హాజరు..







