అమెరికాలో విమాన ప్రమాదం.. మచిలీపట్నం డాక్టర్ దంపతుల దుర్మరణం
- July 12, 2017
అమెరికాలోని ఒహియో రాష్ట్రంలో శనివారం జరిగిన విమాన ప్రమాదంలో కృష్ణాజిల్లా మచిలీపట్నానికి చెందిన దంపతులు మృతి చెందారు. బెవర్లీలోని వాషింగ్టన్ కౌంటీ విలేజ్ సమీపంలో సరస్సులో చార్డెడ్ విమానం కూలిపోవడంతో ఈ ప్రమాదం జరిగింది.
మృతులు మచిలీపట్నానికి చెందిన కల్పాటపు ఉమామహేశ్వర రావు(63), సీతాగీత(61)గా గుర్తించారు. 40 ఏళ్ల క్రితమే ఇండియానా రాష్ట్రంలోని లోగన్ స్పోర్ట్ లో స్థిరపడిన ఉమామహేశ్వర రావు దంపతులు అక్కడే రాజ్హాస్పిటల్స్ నిర్వహిస్తున్నారు.
ఉమామహేశ్వర రావు, సీతాగీత ఇద్దరూ గుంటూరు వైద్య కళాశాలలో విద్యనభ్యసించారు.
శనివారం ఇండియానాలోని కాస్ కౌంటీ నుంచి వీరి విమానం బయలుదేరిందని, చివరిసారిగా ఉదయం 10.30 గంటల ప్రాంతంలో పశ్చిమ వర్జీనియాలోని పార్కెర్స్ బర్గ్ సమీపంలో ఉన్న ఎయిర్ పోర్టుతో కూడా కాంటాక్ట్ అయ్యారని, మధ్యాహ్నానికి విమానం కనిపించకుండా పోయిందని అధికారులు పేర్కొన్నారు.
శనివారం మధ్యాహ్నం ఓ సరస్సు ఓడ్డున వీరి విమాన శకలాలను గుర్తించారు. ప్రమాదానికి దారితీసిన కారణాలేమీ తెలియరాలేదు. ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ మరియు నేషనల్ ట్రాన్స్ పోర్టేషన్ సేఫ్టీ బోర్డ్ ఈ ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్నాయి.
తాజా వార్తలు
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్కాందే బాధ్యత
- కువైట్లో స్మార్ట్ ట్రాఫిక్ సిగ్నళ్లు..!!
- మెసైమీర్ ఇంటర్చేంజ్ టన్నెల్ తాత్కాలికంగా మూసివేత..!!
- ఒమన్లో కఠిన చట్టం.. OMR100,000 వరకు జరిమానా..!!
- 50 డిగ్రీల వేడిలోనూ యూఏఈలో వర్షాలు..!!
- ఆన్లైన్ యాప్లతో హ్యూమన్ ట్రాఫికింగ్ ముప్పు పెరుగుతోంది..!!
- సౌదీ నేతృత్వంలో సముద్ర రక్షణ కూటమి ఏర్పాటు..!!
- బహ్రెయిన్ షీల్డ్ సంయుక్త సైనిక విన్యాసాలకు షేక్ హమ్దాన్ హాజరు..







