సౌదీలో తెలంగాణకు చెందిన వలస కూలీ మృతి
- July 14, 2017
జీవనోపాధి కోసం విదేశాలకు వెళ్లిన ఓ యువకుడు మృతి చెందాడు. మహ బూబ్నగర్ జిల్లా కోస్గి మండలం పోలేపల్లి పల్లెగడ్డకు చెందిన మల్లయ్య(35) జీవనోపాధి కోసం 2014లో సౌదీ అరేబియాకు వెళ్లాడు. మల్లయ్య మృతి చెందాడంటూ తోటి కూలీలు గురువారం ఫోన్ చేసి ఆయన భార్యకు సమాచారం ఇచ్చారు.
అయితే, పూర్తి సమా చారం తెలుసుకునేందుకు ఆరా తీయగా మొదట ఫోన్ చేసిన కూలీలు మళ్లీ అందు బాటులోకి రాలేదు. ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం లేకపోవడంతో శుక్రవా రం కలెక్టర్ రొనాల్డ్రాస్ను కలసి తమ పరిస్థితి వివరించారు. ఎంపీ జితేందర్ రెడ్డికి ఫోన్లో సమాచారం ఇవ్వగా ప్రభుత్వం తరఫున∙విదేశాంగ మంత్రితో మాట్లాడి బాధిత కుటుంబానికి న్యాయం చేసేందుకు చర్యలు తీసుకుంటానని చెప్పారని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్కాందే బాధ్యత
- కువైట్లో స్మార్ట్ ట్రాఫిక్ సిగ్నళ్లు..!!
- మెసైమీర్ ఇంటర్చేంజ్ టన్నెల్ తాత్కాలికంగా మూసివేత..!!
- ఒమన్లో కఠిన చట్టం.. OMR100,000 వరకు జరిమానా..!!
- 50 డిగ్రీల వేడిలోనూ యూఏఈలో వర్షాలు..!!
- ఆన్లైన్ యాప్లతో హ్యూమన్ ట్రాఫికింగ్ ముప్పు పెరుగుతోంది..!!
- సౌదీ నేతృత్వంలో సముద్ర రక్షణ కూటమి ఏర్పాటు..!!
- బహ్రెయిన్ షీల్డ్ సంయుక్త సైనిక విన్యాసాలకు షేక్ హమ్దాన్ హాజరు..







