యునైటెడ్ నేషన్స్ చిల్డ్రన్ ఫండ్ ప్రచారకర్తగా 'సూపర్వుమెన్'
- July 15, 2017
యూనిసెఫ్(యునైటెడ్ నేషన్స్ చిల్డ్రన్ ఫండ్) సుహృద్భావ ప్రచార కర్తగా యూట్యూబ్ స్టార్, భారత సంతతికి చెందిన సూపర్వుమెన్ లిల్లీ సింగ్ నియమితులయ్యారు. శుక్రవారం ఈ విషయాన్ని యూనిసెఫ్ అధికారికంగా ప్రకటించింది. యూనిసెఫ్ నిర్వహించే 'యూత్ ఫర్ ఛేంజ్' కార్యక్రమంలో లిల్లీ భాగస్వామురాలిగా మారారు. ఆరోగ్యం, పారిశుద్ధ్యం, బాలకార్మికులు, లింగవివక్ష తదితర అంశాల గురించి యూనిసెఫ్ నిర్వహించే ప్రచార కార్యక్రమాలకు ఇక నుంచి సూపర్వుమెన్ ప్రాతినిథ్యం వహిస్తారు. సుహృద్భావ ప్రచార కర్తగా నియమితులైనందుకు లిల్లీ ఆనందం వ్యక్తం చేశారు. యూట్యూబ్లో 'సూపర్వుమెన్' పేరుతో ప్రత్యేక ఛానెల్ ద్వారా ఆమె చేస్తున్న వీడియోలు ఎంతో ప్రాచుర్యం పొందుతున్నాయి. ఈ ఛానెల్ను దాదాపు 11.9 మిలియన్ల మంది చందాదారులు ఉన్నారు. బాలల హక్కుల కోసం యూనిసెఫ్ చేపట్టే ఈ బృహత్తర కార్యక్రమానికి ఆమె ఛానెల్ను వేదికగా ఉపయోగించుకోనున్నారు.
తాజా వార్తలు
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్కాందే బాధ్యత
- కువైట్లో స్మార్ట్ ట్రాఫిక్ సిగ్నళ్లు..!!
- మెసైమీర్ ఇంటర్చేంజ్ టన్నెల్ తాత్కాలికంగా మూసివేత..!!
- ఒమన్లో కఠిన చట్టం.. OMR100,000 వరకు జరిమానా..!!
- 50 డిగ్రీల వేడిలోనూ యూఏఈలో వర్షాలు..!!
- ఆన్లైన్ యాప్లతో హ్యూమన్ ట్రాఫికింగ్ ముప్పు పెరుగుతోంది..!!
- సౌదీ నేతృత్వంలో సముద్ర రక్షణ కూటమి ఏర్పాటు..!!
- బహ్రెయిన్ షీల్డ్ సంయుక్త సైనిక విన్యాసాలకు షేక్ హమ్దాన్ హాజరు..







