యునైటెడ్ నేషన్స్ చిల్డ్రన్ ఫండ్ ప్రచారకర్తగా 'సూపర్వుమెన్'
- July 15, 2017
యూనిసెఫ్(యునైటెడ్ నేషన్స్ చిల్డ్రన్ ఫండ్) సుహృద్భావ ప్రచార కర్తగా యూట్యూబ్ స్టార్, భారత సంతతికి చెందిన సూపర్వుమెన్ లిల్లీ సింగ్ నియమితులయ్యారు. శుక్రవారం ఈ విషయాన్ని యూనిసెఫ్ అధికారికంగా ప్రకటించింది. యూనిసెఫ్ నిర్వహించే 'యూత్ ఫర్ ఛేంజ్' కార్యక్రమంలో లిల్లీ భాగస్వామురాలిగా మారారు. ఆరోగ్యం, పారిశుద్ధ్యం, బాలకార్మికులు, లింగవివక్ష తదితర అంశాల గురించి యూనిసెఫ్ నిర్వహించే ప్రచార కార్యక్రమాలకు ఇక నుంచి సూపర్వుమెన్ ప్రాతినిథ్యం వహిస్తారు. సుహృద్భావ ప్రచార కర్తగా నియమితులైనందుకు లిల్లీ ఆనందం వ్యక్తం చేశారు. యూట్యూబ్లో 'సూపర్వుమెన్' పేరుతో ప్రత్యేక ఛానెల్ ద్వారా ఆమె చేస్తున్న వీడియోలు ఎంతో ప్రాచుర్యం పొందుతున్నాయి. ఈ ఛానెల్ను దాదాపు 11.9 మిలియన్ల మంది చందాదారులు ఉన్నారు. బాలల హక్కుల కోసం యూనిసెఫ్ చేపట్టే ఈ బృహత్తర కార్యక్రమానికి ఆమె ఛానెల్ను వేదికగా ఉపయోగించుకోనున్నారు.
తాజా వార్తలు
- AI డీప్ఫేక్ మోసాల పట్ల కేంద్రం కీలక హెచ్చరిక
- సూడాన్లో డ్రోన్ దాడిలో 15 మంది మృత్యువాత..
- అమరావతికి భారీ నిధులు..రూ.2,534 కోట్లతో కొత్త ప్రాజెక్టులు షురూ!
- అమెరికా వీసా కోసం నెలల వెయిటింగ్? ఇకపై ఫాస్ట్ ట్రాక్ మార్గం ఇదే!
- ప్రపంచంలోనే తొలి ట్రిలియనీర్గా ఎలాన్ మస్క్
- క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్..2027 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల
- సాహ్ల్ ద్వారా డొమెస్టిక్ వర్కర్లు, డ్రైవర్ల స్పాన్సర్షిప్ బదిలీ..!!
- షార్జాలో హత్యకు గురైన భారతీయుడి మృతదేహం స్వదేశానికి తరలింపు..!!
- ఏప్రిల్లో 16% పెరిగి SR14.7 బిలియన్లకు చేరిన రెమిటెన్స్..!!
- ఆన్లైన్లో ఉగ్రవాద సంబంధిత దుస్తులు సేల్..ముగ్గురు అరెస్టు..!!









