ఐసిస్ బందీలుగా ఉన్న 39మంది భారతీయులు ఇరాక్ జైల్లో
- July 16, 2017
మోసుల్లోని ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల దగ్గర మూడేళ్ల నుంచి బందీలుగా ఉన్న 39 మంది భారతీయులు ప్రస్తుతం ఇరాక్లోని జైల్లో ఉన్నట్లు కేంద్ర విదేశాంగశాఖ మంత్రి సుష్మా స్వరాజ్ తెలిపారు. ఆదివారం ఆ 39 మంది భారతీయుల కుటుంబసభ్యులను మంత్రి ప్రత్యేకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. 'ఇరాక్లో బందీలుగా ఉన్న వారి కుటుంబాలను పిలిచి మాట్లాడాను. వాళ్లని ఇప్పటి వరకు తొమ్మిది సార్లు కలిశాను. కానీ ఈ సారి వాళ్లని కలవడం ప్రత్యేకం. ఎందుకంటే ఐసిస్ ఆధీనంలో ఉన్న మోసుల్ ప్రాంతాన్ని ఇరాకీ సైన్యం స్వాధీనం చేసుకున్నట్లు ఆదేశ ప్రధానమంత్రి అధికారికంగా ప్రకటించారు. దాంతో వారి వద్ద బందీలుగా ఉన్న 39 భారతీయులను కాపాడి వెనక్కి తీసుకొచ్చేలా ఏర్పాట్లు చేయమని మంత్రి వికె.సింగ్కు చెప్పాను' అని తెలిపారు. 'కేంద్రమంత్రి వికె సింగ్ ఇరాక్ పర్యటనకు వెళ్లినపుడు భారతీయుల ఆచూకీ గురించి ఆరాతీశారు. వాళ్లంతా బదుష్ జైల్లో ఉన్నట్లు తెలిసింది. ఇరాకీ అధికారుల సమాచారం ప్రకారం ఓ ఆసుపత్రి నిర్మాణ పనుల్లో ఉన్న భారతీయులను అపహరించారని తెలిసిందని' సుష్మ పేర్కొన్నారు. ఇరాకీ విదేశాంగశాఖ మంత్రితో మాట్లాడి వీలైనంత త్వరగా 39 మంది భారతీయులను వెనక్కి తీసుకొస్తామని మంత్రి హామీ ఇచ్చారు. 39 మందిలో భారతీయుల్లో ఎక్కువ మంది పంజాబ్కు చెందిన కూలీలే ఉన్నారు.
తాజా వార్తలు
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్కాందే బాధ్యత
- కువైట్లో స్మార్ట్ ట్రాఫిక్ సిగ్నళ్లు..!!
- మెసైమీర్ ఇంటర్చేంజ్ టన్నెల్ తాత్కాలికంగా మూసివేత..!!
- ఒమన్లో కఠిన చట్టం.. OMR100,000 వరకు జరిమానా..!!
- 50 డిగ్రీల వేడిలోనూ యూఏఈలో వర్షాలు..!!
- ఆన్లైన్ యాప్లతో హ్యూమన్ ట్రాఫికింగ్ ముప్పు పెరుగుతోంది..!!
- సౌదీ నేతృత్వంలో సముద్ర రక్షణ కూటమి ఏర్పాటు..!!
- బహ్రెయిన్ షీల్డ్ సంయుక్త సైనిక విన్యాసాలకు షేక్ హమ్దాన్ హాజరు..







