పి.వాసు దర్శకత్వంలో హీరోయిన్ కాజల్
- July 16, 2017
సూపర్స్టార్ రజనీకాంత్ నటించిన 'పనక్కారన్', 'మన్నన్', 'చంద్రముఖి' వంటి పలు హిట్ చిత్రాలతో గుర్తింపు సొంతం చేసుకున్నారు దర్శక నటుడు పి.వాసు. ఇటీవల ఆయన లారెన్స్ హీరోగా 'శివలింగ' చిత్రాన్ని రూపొందించారు. అయితే అది ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేక పోయింది. ఇదిలా ఉండగా ఇప్పుడు కథానాయిక ప్రాధాన్యత కలిగిన చిత్రాన్ని ఆయన తెరకెక్కించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తాను వూహించుకున్న పాత్రకు తగ్గట్టు కథానాయికను ఎంపిక చేసే పనుల్లో కొంత కాలంగా వాసు ఉన్నారు. అయితే చివరకు ఆ పాత్ర కోసం కాజల్ను ఎంచుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం కాజల్ అజిత్తో 'వివేగం', విజయ్తో 'మెర్సల్' చిత్రాల్లో నటిస్తోంది.
అంతేకాకుండా మరికొన్ని తెలుగు, తమిళ చిత్రాల్లోనూ నటిస్తున్నారు. ఈ నేపథ్యంలో తొలిసారిగా నయనతార, అనుష్క, త్రిష లాగా కథానాయిక ప్రాధాన్యత ఉన్న చిత్రంలో నటించనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కించనున్నట్లు కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇతర నటీనటుల ఎంపిక ప్రక్రియ జరుగుతోందని, ఈ పనులు పూర్తయిన తర్వాత పి.వాసు అధికారికంగా ప్రకటిస్తారని సమాచారం.
తాజా వార్తలు
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్కాందే బాధ్యత
- కువైట్లో స్మార్ట్ ట్రాఫిక్ సిగ్నళ్లు..!!
- మెసైమీర్ ఇంటర్చేంజ్ టన్నెల్ తాత్కాలికంగా మూసివేత..!!
- ఒమన్లో కఠిన చట్టం.. OMR100,000 వరకు జరిమానా..!!
- 50 డిగ్రీల వేడిలోనూ యూఏఈలో వర్షాలు..!!
- ఆన్లైన్ యాప్లతో హ్యూమన్ ట్రాఫికింగ్ ముప్పు పెరుగుతోంది..!!
- సౌదీ నేతృత్వంలో సముద్ర రక్షణ కూటమి ఏర్పాటు..!!
- బహ్రెయిన్ షీల్డ్ సంయుక్త సైనిక విన్యాసాలకు షేక్ హమ్దాన్ హాజరు..







