పి.వాసు దర్శకత్వంలో హీరోయిన్ కాజల్
- July 16, 2017
సూపర్స్టార్ రజనీకాంత్ నటించిన 'పనక్కారన్', 'మన్నన్', 'చంద్రముఖి' వంటి పలు హిట్ చిత్రాలతో గుర్తింపు సొంతం చేసుకున్నారు దర్శక నటుడు పి.వాసు. ఇటీవల ఆయన లారెన్స్ హీరోగా 'శివలింగ' చిత్రాన్ని రూపొందించారు. అయితే అది ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేక పోయింది. ఇదిలా ఉండగా ఇప్పుడు కథానాయిక ప్రాధాన్యత కలిగిన చిత్రాన్ని ఆయన తెరకెక్కించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తాను వూహించుకున్న పాత్రకు తగ్గట్టు కథానాయికను ఎంపిక చేసే పనుల్లో కొంత కాలంగా వాసు ఉన్నారు. అయితే చివరకు ఆ పాత్ర కోసం కాజల్ను ఎంచుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం కాజల్ అజిత్తో 'వివేగం', విజయ్తో 'మెర్సల్' చిత్రాల్లో నటిస్తోంది.
అంతేకాకుండా మరికొన్ని తెలుగు, తమిళ చిత్రాల్లోనూ నటిస్తున్నారు. ఈ నేపథ్యంలో తొలిసారిగా నయనతార, అనుష్క, త్రిష లాగా కథానాయిక ప్రాధాన్యత ఉన్న చిత్రంలో నటించనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కించనున్నట్లు కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇతర నటీనటుల ఎంపిక ప్రక్రియ జరుగుతోందని, ఈ పనులు పూర్తయిన తర్వాత పి.వాసు అధికారికంగా ప్రకటిస్తారని సమాచారం.
తాజా వార్తలు
- అమెరికా నెక్స్ట్ టార్గెట్ ఈక్వెడార్..ప్రారంభమైన దాడులు
- సెమీస్ పరీక్షకు సిద్ధమైన భారత్..!
- ఖమేనీ అంత్యక్రియల వాయిదా
- తెలంగాణ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు
- బహ్రెయిన్ పై మిస్సైళ్లతో విచుచుకుపడ్డ ఇరాన్..అడ్డుకున్న రక్షణ వ్యవస్థలు..!!
- QR1 మిలియన్ జరిమానా, కంపెనీ సీజ్:ఖతార్
- భారతీయులకు వీసా సరళీకరణను ప్రకటించిన ఒమన్..!!
- యూఏఈ, జీసీసీ దేశాల అత్యవసర సమావేశం..ఉమ్మడి కార్యాచరణపై సమీక్ష..!!
- కువైట్ లో వీసా గడువు పొడిగింపు, విదేశాలలో ఉన్నవారికి సెలవు మంజూరు..!!
- ఇరాన్ దురాక్రమణను ఖండించండి..అంతర్జాతీయ సమాజానికి సౌదీ పిలుపు..!!









